బాధ్యతగా మొక్కలు నాటాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉద్యమంలా సాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కథానాయిక పూజా హెగ్డే పాల్గొన్నారు. యువ హీరో సుషాంత్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించి శుక్రవారం రామోజీ

Updated : 27 Nov 2021 08:02 IST

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉద్యమంలా సాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కథానాయిక పూజాహెగ్డే పాల్గొన్నారు. యువ హీరో సుషాంత్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించి శుక్రవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పూజాహెగ్డే మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి, సమాజంపై బాధ్యతతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమం గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్తు తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ చేస్తున్నా’’నన్నారు.

- న్యూస్‌టుడే, అబ్దుల్లాపూర్‌మెట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని