Radhe shyam: ప్రభాస్‌ అభిమానుల నిరీక్షణకు తెర.. ‘రాధేశ్యామ్‌’ గీతం వచ్చేసింది

ప్రముఖ నటుడు ప్రభాస్‌ చాలాకాలం తర్వాత నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక.

Published : 15 Nov 2021 21:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ చాలాకాలం తర్వాత నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా మ్యూజిక్‌ అప్‌డేట్‌ గురించి ప్రభాస్‌ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మంచి ప్రేమ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాటని కృష్ణకాంత్‌ (తెలుగు వెర్షన్‌) రచించారు. యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించారు. ఈ వినసొంపైన గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. ప్రభాస్‌- పూజాహెగ్డే జోడీ ఆకట్టుకుంటుంది.

ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని