Maa Elections: ‘మా’లో ఉన్నది 900మంది కాదు.. అసలు లెక్క ఇదీ: ప్రకాశ్రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మసకబారడానికి అందులో ఉన్న 900మంది సభ్యులు కారణం కాదని, తాము ఎన్నుకున్న 30మంది కారణమని సినీ నటుడు, మా ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్రాజ్ అన్నారు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మసకబారడానికి అందులో ఉన్న 900మంది సభ్యులు కారణం కాదని, మనం ఎన్నుకునే 30మందే కారణమని సినీ నటుడు, మా ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్రాజ్ అన్నారు. మంగళవారం సినీ‘మా’బిడ్డలం పేరుతో తన ప్యానెల్ సభ్యులు, ఆయనకు మద్దతు తెలిపే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రాజ్ మాట్లాడారు. ‘‘రెండేళ్ల కిందట మా ఎన్నికలు జరిగిన సమయంలో కూడా నేను పోటీ చేద్దామనుకున్నా. కొందరు రమ్మన్నారు.. ఇంకొందరు వద్దన్నారు. తప్పు చేసిన వాడిని చరిత్ర మర్చిపోవచ్చేమో కానీ, మౌనంగా ఉన్న వాడిని క్షమించదు. అందుకే నేను మౌనంగా ఉండకూడదనిపించింది. నేను ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. మనిషి ఎదిగిన ఎత్తును బట్టి అతడిని కొలవకూడదు. వాడు ఎంతమందిని ఎదగనిచ్చాడో దాన్ని బట్టి కొలవాలి. అది నా తల్లి నాకు నేర్పిన పాఠం. మనకు తెలియకుండానే ‘మా’ను ఓ ఛారిటీ అసోసియేషన్గా మార్చేశారు. చనిపోయినప్పుడు డబ్బులు ఇవ్వడం, రేషన్ ఇప్పించడం, వేషాలు దక్కేలా చూడటం.. ఇది కాదు ‘మా’ అసోసియేషన్. ఇది ఆర్టిస్టులను బలపరిచే అసోసియేషన్గా ఉండాలి. ఆర్టిస్ట్కు కష్టం లేకుండా చేసేలా అసోసియేషన్ పనిచేయాలి. అసలు సమస్యను పరిష్కరించాలంటే ముందు దానిపై అవగాహన ఉండాలి’’
సాయం చేయాల్సింది 250మందికి మాత్రమే!
‘‘మా’ అసోసియేషన్లో 900మంది సభ్యులున్నారని అందరూ అంటున్నారు. అందులో సుమారు 150మంది యాక్టివ్ మెంబర్స్ కాదు. జెనీలియా మాజీ సీఎం కొడుకును వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ఆమె యాక్టివ్ మెంబర్కారు. అలాంటి వాళ్లను తీసేస్తే, 750మంది మాత్రమే ఉన్నాం. అందులో 147మంది స్థానికులు కాదు. చెన్నై, బెంగళూరు, కేరళ నుంచి వచ్చి తమ షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోతారు. వాళ్లకు అమౌంట్, బస, ఫ్లైట్ టికెట్స్కు డబ్బులు కూడా బాగానే ఇస్తారు. ఇక ఉన్నది 600మంది మాత్రమే! అందులో కొందరు యువ కథానాయకులు, పెద్ద పెద్ద నటులు ఓటింగ్కు రారు. వాళ్లకు అవసరం లేదు. మిగిలింది 450మంది. అందులో కూడా 200మంది బాగానే ఉన్నారు. ఇంకా ఆదుకోవాల్సింది 250మందిని మాత్రమే. ఆదుకోలేమా! అందులో 40 రంగస్థల కళాకారులు ఉన్నారు. వాళ్లకు సినిమా పాలిటిక్స్ తెలియవు. ఎక్కడకు వెళ్లాలో తెలియదు. కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే, సినిమా కెమెరాకు అనుగుణంగా చక్కగా నటిస్తారు. నేను ఊరికినే ఎన్నికలకు రాలేదు. ఆరు నెలల పాటు ఈ హోం వర్క్ చేసుకుని వచ్చా! ‘నాటక కళాకారులకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా! ఎందుకు అందించటం లేదు’ అని నేను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్గారిని అడిగితే, ‘మమ్మల్ని ఎవరూ అడగలేదు కదా’ అని అన్నారు. మంచి చేయాలనుకుంటున్నారు కానీ, ఎలా చేయాలో ఎవరికీ తెలియదు’’
100మంది వైద్యులతో క్లబ్ ఏర్పాటు చేస్తాం!
‘‘నాకు వ్యక్తిగతంగా కొంతమంది వైద్యులు తెలుసు. ‘నేను మా అసోసియేషన్ అధ్యక్షుడినైతే, నాకు 100మంది వైద్యులను ప్రత్యేకంగా సినిమా ఆర్టిస్ట్లకు ఇప్పించొచ్చు కదా’ అని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకొన్నారు. 100మంది వైద్యులతో క్లబ్ ఏర్పాటు చేస్తాం. మా అధ్యక్షుడిగా ఎన్నికైన మూడు నెలల్లో ‘మా’ అసోసియేషన్ ఆఫీస్లో ప్రతి ఒక్కరికీ హెల్త్కార్డు ఉంటుంది. ‘నేను చేశాను’ అంటూ వచ్చే వాడు ఏమీ చేయడు. కానీ నేను, 10మందితో చేయిస్తాను. 10 మందితో కలిసి చేస్తాను. పేద కళాకారుల పిల్లలను దత్తత తీసుకుని వారి చదువుకు అయ్యే ఖర్చు భరించేలా హీరోలను ప్రోత్సహిస్తా. కొవిడ్ సమయంలో ‘నవరస’ ప్రాజెక్టు చేసి పేద కళాకారులను ఆదుకున్నాం. తెలుగులోనూ సాయం అడిగితే చేసేందుకు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, క్రిష్, నాని, శర్వానంద్ ఇలా అందరూ ముందుకు వస్తానని అన్నారు. ‘మా’ అసోసియేషన్లో బాగా ఉన్న 200మందితో పని చేయించడానికి వస్తున్నాం. ఇక నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో నలుగురు కో-ఆర్డినేటర్స్ ఉంటారు. ప్యానెల్లో ఉన్న 26మందికీ 26 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఈ మెంబర్స్ సినిమా సెట్స్కు వెళ్లి, ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ‘మా’ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఎంత పెద్ద హీరో, హీరోయిన్ అయినా, వాళ్లను నేను అధ్యక్షుడిని, వాళ్లు ‘మా’లో సభ్యులు’’ అని ప్రకాశ్రాజ్ అన్నారు.
ఇంకా ‘మా’ ఎన్నికలు, చిత్ర పరిశ్రమ, ఇతర నటీనటుల గురించి ప్రకాశ్రాజ్ పదునైన మాటల ప్రవాహం ఈ వీడియోలో చూడండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?