Narappa: అందుకే ‘అసురన్’ను రీమేక్ చేశాం!
వెంకటేశ్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘన విజయం అందుకున్న ‘అసురన్’కి రీమేక్గా రూపొందింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్హిట్ ‘అసురన్’కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మించారు. జులై 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సురేశ్ బాబు మీడియాతో ముచ్చటించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రాన్ని ఓటీటీలో ఎందుకు విడుదల చేస్తున్నారు? ‘అసురన్’నే ఎందుకు రీమేక్ చేశారు? తదితర విషయాలు పంచుకున్నారు.
ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి కారణం?
సురేశ్ బాబు: దీనికి చాలా కారణాలున్నాయి. నేనూ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల ఆయన ‘కర్ణన్’ అనే సినిమా విడుదల చేశారు. 100 శాతం ఆక్యుపెన్సీతో మొదటి వారం, 75 శాతం ఆక్యుపెన్సీతో రెండో వారం మాత్రమే థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శితమైంది. కరోనా ఉద్ధృతి ఎక్కువకావడంతో థియేటర్లు మూత బడ్డాయి. దాంతో ఆయనకు సుమారు రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సినిమా విషయంలోనూ అదే ఎదురవుతుందేమోననే భయం మొదలైంది. ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ ఓటీటీ విడుదలకి నిర్ణయించుకున్నాం. అయితే కొవిడ్ రాని వాళ్లు ఒకలా భావిస్తున్నారు. వచ్చిన వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు మరోలా ఆలోచిస్తుంటారు. మనం మన కుటుంబ సభ్యుల్ని థియేటర్లకి పంపించనప్పుడు ‘మా సినిమాకి రండి’ అంటూ ఇతర కుటుంబాల్ని ఎలా అడుగుతాం.
దీని వల్ల వెంకటేశ్ అభిమానులు ఫీలవుతున్నారు కదా!
సురేశ్ బాబు: అవును నిజమే. అభిమానులే కాదు వెంకటేశ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నేనూ బాధపడుతున్నాను. కానీ, జీవితంలో ప్రాక్టికల్గా ఉండాల్సిందే.
మీరూ సినిమాల్ని పంపిణీ చేస్తుంటారు. సరిగ్గా థియేటర్లు తెరచుకునే సమయంలో సురేశ్ బాబు ఇలా చేయడం సరికాదంటూ ఎగ్జిబిటర్లు అంటున్నారు. దాని గురించి..
సురేశ్ బాబు: ముందుగా చెప్పినట్టు ఇది నేనొక్కడినే నిర్మించిన సినిమా కాదు. మా సొంత బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్లో రూపొందిన, పార్టనర్ షిప్లో అధిక భాగం నాదే అయినా చిత్రమైతే ఓటీటీ విడుదలకు ఒప్పుకోను. పార్టనర్ విషయంలో రాజీ పడాలి. లేదంటే ‘మీరు థియేటర్లలో విడుదల చేసి డిస్ట్రిబ్యూషన్ కమీషన్ సంపాదించుకుంటారా’ అనే మాటలు వినిపిస్తుంటాయి.
స్టార్ హీరోల చిత్రాలూ ఓటీటీ వస్తుంటే థియేటర్లు కనుమరుగయ్యే అవకాశం ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి?
సురేశ్ బాబు: థియేటర్ల వ్యవస్థలో కొద్దిగా మార్పు వస్తుందేమో కానీ, కనుమరుగయ్యే అవకాశం ఉండదు. ప్రపంచంలోనే పెద్ద నిర్మాణ సంస్థగా పేర్కొన్న డిస్నీనే థియేటర్లతో పాటు తమ చిత్రాల్ని ఓటీటీలోనూ విడుదల చేస్తుంది. ఎందుకంటే పరిస్థితుల్ని బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని తెలుసుకుందా సంస్థ. కొవిడ్ రాకపోయి ఉంటే ఓటీటీ ఇంత పాపులర్ అయ్యేది కాదు. చాలా సమయం పట్టేది.
మన దగ్గరా ఇలాంటి పరిస్థితి వస్తుందంటారా?
సురేశ్ బాబు: ప్రస్తుతానికి ఉండదు. థియేటర్ల యాజమాన్యాలు ఒప్పుకోవు. కొంత వ్యవధి తర్వాత ఓటీటీలోకి విడుదల చేసేందుకే ఇక్కడ అనుమతి ఉంది.
‘అసురన్’ చిత్రాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
సురేశ్ బాబు: ఏ నటుడికైనా కొత్త తరహా పాత్రలు పోషించాలని ఉంటుంది. వెంకటేశ్ అలాంటి పాత్రల కోసమే చూస్తుంటాడు. ఓసారి ‘అసురన్’ చిత్రం చూసి, బాగుంది నువ్వు కూడా చూడు అని నాతో అన్నాడు. నేను ఆ సినిమా చూసిన వెంటనే చేసేద్దాం అని చెప్పా. వెంకటేశ్ హీరోగా తెలుగు దర్శక-రచయితలెవరూ ఇలాంటి కథని రాసి తీసుకురారు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి పాత్రలు అంగీకరిస్తారో లేదోననే సందేహం ఉంటుంది. వెట్రిమారన్ (అసురన్ దర్శకుడు) వాస్తవికతని చూపిస్తూనే కమర్షియల్ హంగులు అద్దిన విధానం చాలా బాగా నచ్చింది. వెంకటేశ్కి తగిన సినిమా అనిపించింది. మాస్ సినిమాలా ఉన్నా కుటుంబ నేపథ్యంలో సాగుతుంది. సందేశమూ ఉంది.
షూటింగ్ సమయంలో ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
సురేశ్ బాబు: సహజంగా తెరకెక్కించేందుకు ఎన్నో లొకేషన్లు వెతికాం. రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని రోజులు చిత్రీకరించాం. కానీ, షూటింగ్కి చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారని చెన్నై చేరుకున్నాం. ఓ షెడ్యూల్కి సంబంధించి ఇంకా నాలుగు రోజుల షూట్ ఉందనగా అక్కడ దగ్గర్లో కొవిడ్ కేసులు ఎక్కువవడంతో హైదరాబాద్ తిరిగి వచ్చాం.
కుటుంబ కథల చిత్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల చేతిలో ఈ చిత్రాన్ని పెట్టడానికి కారణం?
సురేశ్ బాబు: కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయి. ఈ సినిమా రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సమయంలో ఓ సారి శ్రీకాంత్ అడ్డాల కలిసి ఓ కథ వినిపించారు. అంతగా నచ్చలేదని చెప్పా. ఆ వెంటనే ‘సర్.. మీరు అసురన్ రీమేక్ చేస్తున్నారట కదా’ అని అడిగారాయన. అవును అనగానే ‘మీరు ఇంకా దర్శకుడ్ని ఖరారు చేయకపోతే.. నాకు ఆసక్తి ఉంది నేను చేస్తా ’అన్నారు. సరే అన్నాను. అలా అసురన్ పట్టాలెక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్తేజ్తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్