Thalaivii: కంగనా రనౌత్ ఎంపిక సరైంది కాదన్నారు!
నిర్మాత విష్ణు వర్ధన్ ఇంటర్వ్యూ. కంగనా రనౌత్, ‘తలైవి’ సినిమా గురించి మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖుల జీవితగాథల్ని తెరపైకి తీసుకురావడమంటే తనకెంతో ఇష్టమని తెలిపారు నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి. శైలేష్ ఆర్. సింగ్తో కలిసి విష్ణు నిర్మించిన చిత్రం ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తెరకెక్కించిన చిత్రమిది. కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషించారు. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. వినాయకచవితి కానుకగా ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విష్ణు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం పడిన ఇబ్బందుల్ని తెలియజేశారు.
‘తలైవి’.. ఆలోచన తనదే
క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. జయలలిత గురించి ప్రపంచానికి తెలియజేయాలనే తన అభిప్రాయాన్ని మాతో పంచుకుంది. ఆమె ఆలోచన మాకు నచ్చడంతో సినిమాని నిర్మించాలనుకున్నాం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. తమిళనాడుకి చెందిన దర్శకుడు అయితే ఈ కథని బాగా డీల్ చేయగలరనే ఉద్దేశంతో విజయ్ని ఎంపిక చేశాం. ఇలాంటి కథని ఎవరు రాయగలరు? అనుకున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు అనిపించింది. టైటిల్ పాత్ర కోసం కంగనా రనౌత్ని అనుకున్నాం అని చెప్పగానే చాలామంది బ్యాడ్ చాయిస్ అన్నారు. ఇదే విషయాన్ని ప్రకటించిన సమయంలో సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు పెట్టారు. కానీ, సినిమా చూశాక తమ అభిప్రాయం మారింది. గతంలో వారు పెట్టిన నెగెటివ్ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ ‘మీ నిర్ణయమే సరైంది’ అని చెబుతున్నారు. నిర్మాతగా ఓ మంచి సినిమా తీశాననే ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఎవర్నీ తక్కువగా చూపించలేదు..
ఈ సినిమాలో జయలలితతోపాటు ఎం.జి.ఆర్. పాత్ర చాలా కీలకమైంది. అందుకే ఈ పాత్రకి అరవింద్ స్వామిని తీసుకున్నాం. ఈ పాత్రకి తక్కువ సన్నివేశాలున్నా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకరిని గొప్పగా మరొకరిని తక్కువగా చూపించే ప్రయత్నం చేయలేదు. కరోనా కారణంగా బడ్జెట్, నటీనటుల విషయంలో కొన్ని మార్పులు చేయాలనుకున్నా. కానీ, సహనిర్మాతల మద్దతుతో ఆ ఆలోచన మానుకున్నా. థియేటర్లని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తెరకెక్కించాం. మరోవైపు నాన్ థియేట్రికల్ రెవెన్యూ బాగా వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాక్సాఫీస్ లెక్కల్నిబట్టి సినిమా హిట్ అయిందా, లేదా? చెప్పలేం. మనం పెట్టిన పెట్టుబడి వచ్చిందా, లేదా? మన సినిమాను ఎంత మంది చూశారు? అనే అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో మేం విజయం అందుకున్నాం.
విమర్శలు లేవు..
నిర్మాతలెవరూ తమ సినిమాని వారం ముందే అందరికీ చూపించే ప్రయత్నం చేయరు. కానీ, నేను చేశా. నా సినిమా మీద నాకున్న నమ్మకం అది. ప్రివ్యూ చూసిన వారంతా బాగుందని చెప్పడంతో సినిమా విడుదలకి ముందురోజు ఎలాంటి ఒత్తిడిలేకుండా ప్రశాంతంగా పడుకున్నా. ‘తలైవి’ విడుదలయ్యాక ఏ విమర్శలూ తలెత్తలేదు. ఈ సినిమా చేస్తున్నామని తెలియగానే జయలలిత కుటుంబ సభ్యులు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అలాంటి వారు సినిమా చూశాక మమ్మల్ని అభినందించారు. జయలలితకి అసలైన నివాళి ఇదే అని అన్నారు. తమిళనాడులో ఇంకా ఎక్కవ స్క్రీన్లలో ఈ సినిమాని ప్రదర్శింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
తదుపరి చిత్రాలు..
నాకు బయోపిక్ సినిమాలంటే చాలా ఇష్టం. కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ మంచి సినిమా. థియేటర్లలోనే విడుదల చేసేందుకు ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం.. ‘ఆజాద్ హింద్’ అనే దేశభక్తి సినిమాకి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. సామాజిక మాధ్యమాల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ‘ట్రెండిండ్’ అనే చిత్రం నిర్మించే ఆలోచన ఉంది. ఈ ప్రాజెక్టులకి సంబంధించిన వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
‘టైగర్’తో సవాల్ ఎదుర్కొన్నా
‘‘ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఒక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను గళంలో వినిపించడం ఎంతో సవాలుతో కూడిన పని’’ అంటోంది కథానాయిక ప్రియాంక చోప్రా. హాలీవుడ్, బాలీవుడ్లో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఈమె.. -
పద్దెనిమిదేళ్ల తర్వాత జోడీగా..
ఆఫ్స్క్రీన్, ఆన్స్క్రీన్లో హిట్ జోడీ అయిన సూర్య, జ్యోతిక తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు. -
రజనీ చిత్రంలో నాగ్?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమా ఇది. సోమవారం పేరుని ప్రకటిస్తున్నారు. -
అశ్వత్థామగా అమితాబ్
‘‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుడిని’’ అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయం అయ్యారు అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్. -
ఆ కళే.. నాకు థెరపీలాంటిది!
అందం.. నటనే కాదు.. అలవోకగా చిత్రాలు గీయగల సృజనశీలి నభా నటేశ్. తనకు మానసిక ప్రశాంతతనిచ్చేవి ఈ పెయింటింగ్సే అంటోందామె. -
యానిమల్ పార్క్ 2026లో..
‘యానిమల్’ సంచలన విజయంతో యావత్తు సినీ పరిశ్రమ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా. బాక్సాఫీసు రికార్డు వసూళ్లతోపాటు విమర్శలూ ఎదుర్కొందీ చిత్రం. -
మూర్తి కలల ప్రయాణం
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. -
విధిని తిరగరాసే ఫరీదాన్
‘హీరామండీ: ది డైమండ్ బజార్’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్ బృందం. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్