Evaru Meelo Koteeswarulu: ఒక్క సెకను ఉందనగా చరణ్ చెప్పిన సమాధానమిదే!
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రసారమవుతోంది. ఆట తీరు.. అందులో ఉండే విధివిధానాలను ప్రేక్షకులకు సులువుగా...
శ్రీశ్రీ కవితతో అదరగొట్టిన తారక్
హైదరాబాద్: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రసారమవుతోంది. ఆట తీరు.. అందులో ఉండే విధివిధానాలను ప్రేక్షకులకు సులువుగా తెలియజేసేందుకు మొదటిగా కర్టన్రైజర్ ప్రసారం చేశారు. ఇందులో రామ్చరణ్ సందడి చేశారు. షోలో ఎంత గెలిస్తే అంత చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చేస్తానంటూ ఆయన ఆట మొదలు పెట్టారు. ఇప్పటివరకు రూ.80,000 గెలుచుకుని ముందుకు సాగుతున్నారు. మరి, చరణ్ని తారక్ అడిగిన ప్రశ్నలేంటి.. వాటి సమాధానాలేంటి? ఓసారి తెలుసుకుందాం!
1.వీటిలో ‘గురువు’ అనే అర్థం కలిగిన పదం ఏది?
ఎ) ఆరోగ్య బి) ఆచార్య సి) ఐశ్వర్య డి) ఆశ్చర్య
సమాధానం: ఆచార్య
2.హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగటం వలన అమరత్వం వస్తుంది?
ఎ) కాలకూటం బి) హలాహలం సి) అమృతం డి) నాలికము
సమాధానం: అమృతం
3. వీటిలో ఎస్ఎల్ఆర్, డీఎస్ఎల్ఆర్, ఇన్స్టెంట్ అనేవి దేనిలో రకాలు?
ఎ) కెమెరాలు బి) పుస్తకాలు సి) విమానాల డి) వజ్రాలు
సమాధానం: కెమెరాలు
4.ఈ ఆడియో క్లిప్లోని గాయకుడు ఎవరు? (నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న)
ఎ) రమణ గోగుల బి) పవన్ కల్యాణ్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) మణిశర్మ
సమాధానం: పవన్ కల్యాణ్
5. వీటిలో క్రికెట్ ఫీల్డింగ్ పొజిషన్ కానిది ఏది?
ఎ) కవర్ పాయింట్ బి) స్లిప్ సి) గల్లీ డి) వింగ్బ్యాక్
సమాధానం: వింగ్ బ్యాక్
(ఈ ప్రశ్నకు చరణ్ నిర్ణీత సమయం ఇంకా ఒక సెకనులో అయిపోతుందనగా సమాధానం చెప్పారు)
6. ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం ఏ నగరంలో ఉంది?
ఎ) న్యూయార్క్ బి) సిడ్నీ సి) ఆమ్స్టర్డ్యాం డి) లండన్
సమాధానం: సిడ్నీ
7. పెటా సంస్ధ వీటిలో దేనికి సంబంధించినది?
ఎ) మహిళల భద్రత బి) మానవ హక్కులు సి) జంతువుల హక్కులు డి) శరణార్థుల హక్కులు
సమాధానం: జంతువుల హక్కులు
8.జూన్ 2021 నాటికి వీరిలో ఎవరి పేరుతో తెలంగాణలో ఒక జిల్లాకు పేరు పెట్టారు?
ఎ) ఏపీజే అబ్దుల్ కలాం బి) ఎస్.రాధాకృష్ణన్ సి) పీవీ నరసింహారావు డి) కుమురం భీం
సమాధానం: కుమురం భీం
ఇలా ఎనిమిది పశ్నలకు సమాధానం చెప్పిన చెర్రీ ఆటలో విజయం సాధించడానికి ముందుకు కొనసాగుతున్నారు. గెలుపొందిన మొత్తాన్ని ఓ గొప్ప కార్యం కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో షోలో అడుగుపెట్టిన చరణ్ ఎంత గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే వేచి చూడాలి. తారక్-చరణ్లతోపాటు సెట్లో రానా కూడా వర్చువల్గా సందడి చేస్తే.. వీళ్ల ముగ్గురి సంభాషణ ఎంత సరదాగా ఉంటుందో తెలుసుకోవాలంటే సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ను చూడాల్సిందే.
శ్రీశ్రీ కవితతో అదరగొట్టిన తారక్..
దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే..
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది.
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా...
ఏదీ ఏదీ ఆగిపోడానికి వీల్లేదు..!!
‘మహాకవి శ్రీశ్రీ గారి పదాల సాక్షిగా చెబుతున్నా. జీవితం జీవనది లాంటిది. ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఆగిపోకుండా మనం అనుకున్నది సాధించాల్సింది మనమే. మనందరం కలిసి కట్టుగా పాటించాల్సిన నియమాలను పాటిస్తే ఈ కష్టాన్ని అలా దాటేస్తాం. ఈ కరోనా మహామ్మారిని చేధించేస్తాం. జీవితం మున్ముందుకు సాగిపోవాలి’ అంటూ కరోనా నేపథ్యంలో మనం ముందుకెలా సాగాలో వ్యాఖ్యానిస్తూ ఎన్టీఆర్ షోని ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ