Naga Chaitanya: నాగ చైతన్య విడుదల చేసిన గీతం.. ‘అనుభవించు రాజా’ విన్నారా! 

రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. టైటిల్‌ గీతాన్ని ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య సోమవారం విడుదల చేశారు.

Published : 11 Oct 2021 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. టైటిల్‌ గీతాన్ని ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య సోమవారం విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అడిగేదెవడు నిన్ను.. ఆపేదెవడు నిన్ను అనుభవించు రాజా’ అంటూ సాగే ఈ హుషారైన పాటని భాస్కర్‌ భట్ల రచించారు. రామ్‌ మిర్యాల ఆలపించారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇది. రాజ్‌తరుణ్‌ సరసన కషికా ఖాన్‌ నటిస్తోంది. పోసాని కృష్ణ మురళీ, అజయ్‌, సుదర్శన్‌, టెంపర్‌ వంశీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని