Raj Tarun: బెట్టింగ్ జోలికి వెళ్లను: రాజ్ తరుణ్
ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన.. మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్...
హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన.. మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు రాజ్ తరుణ్. కెరీర్లో ఎత్తుపల్లాలు చవిచూస్తోన్న ఆయన ఇప్పుడు మరోసారి అదే బ్యానర్పై హిట్ అందుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రాజ్ తరుణ్ తాజాగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలివే..!
నా సినిమాలు ఎక్కువగా అక్కడే జరిగాయి..:
‘‘సినిమా కథ విన్నప్పుడు నాకెంతో నచ్చింది. సినిమా చేయాలని అనుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ కూడా చూశాను. సినిమా నాకు బాగా నచ్చింది. చాలారోజుల గ్యాప్ తర్వాత ఇలాంటి సరదా క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం భీమవరంలోనే జరిగింది. నిజం చెప్పాలంటే నా సినిమాల షూటింగ్స్ ఆ ప్రాంతంలోనే జరిగాయి. దాంతో ఆ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది. అక్కడ ప్రజలు నాకు బాగా పరిచయమయ్యారు’’
రియల్లైఫ్తో సంబంధం లేదు..:
‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు బంగారం. సరదాలకు అలవాటు పడిన వ్యక్తి. కోడి పందేలు వేస్తుంటాడు. డబ్బులు దుబారా చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే రియల్ లైఫ్లో నాకు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సంక్రాంతి టైమ్లో ఊర్లో కోడిపందేలు చూసేవాడిని అంతే. సినిమాలోని పాత్రకు నా రియల్లైఫ్కి ఎలాంటి సంబంధం ఉండదు’’
సెక్యూరిటీ గార్డ్ అంత ఈజీ కాదు..:
‘‘ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నేను సెక్యూరిటీ గార్డ్గా కనిపిస్తాను. సాధారణంగా మనం సెక్యూరిటీ గార్డ్ అంటే చులకనగా చూస్తుంటాం. కానీ సెక్యూరిటీ గార్డ్ కావడం కూడా అంత సులభం కాదు. వాళ్లక్కూడా ఫిజికల్ టెస్టుతో పాటు శిక్షణ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్గా పనిచేయడం కూడా అంత సులభమైన విషయం కాదని సినిమా షూట్లో అర్థమైంది.’’
కథ ఎప్పుడో విన్నా.. కానీ:
‘‘శ్రీను గవిరెడ్డితో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. గడిచిన తొమ్మిదేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. వారంలో రెండు సార్లైనా మేమిద్దరం తప్పకుండా కలుస్తాం. సరదాగా మాట్లాడుకుంటాం. మా ఇద్దరి కాంబోలో వచ్చిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ ఫ్లాప్ అయ్యింది. ‘అనుభవించు రాజా’ కథ గురించి తను నాతో ఎన్నో సార్లు చెప్పాడు. స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడే నాకు ఈ కథ తెలుసు. కానీ ఈ సినిమాలో ఎవరు చేస్తారో తెలీదు. అలాంటి టైమ్లో శ్రీను ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లి.. కథ చెప్పగా.. నాగార్జున, సుప్రియలకు బాగా నచ్చింది. వెంటనే వాళ్లు నేనైతే ఈ కథకు సెట్ అవుతానని భావించి నన్నూ ఇందులో భాగం చేశారు’’
ఒకరిపై నిందలు వేయకూడదు..:
‘‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు’ ఫ్లాప్ అయ్యాక.. శ్రీనుతో చేస్తున్న సినిమా ఇదే కావడంతో అందరూ ఈ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతున్నారు. ‘శ్రీనుతో ఓ ఫ్లాప్ చూశారు కదా.. ఈ సినిమా చేసేటప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకుని భయపడ్డారా’? అని అందరూ అంటున్నారు. నిజం చెప్పాలంటే శ్రీను ఎలాంటి వ్యక్తో నాకు బాగా తెలుసు. అయినా ఒక సినిమా పరాజయానికి ఎన్నో కారణాలుంటాయి. ఒక వ్యక్తిపైనే నిందలు వేయడం సరైన పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం’’
నా అదృష్టం..:
‘‘అన్నపూర్ణ స్టూడియోస్తోనే నేను హీరోగా పరిచయమయ్యాను. ఇప్పుడు అదే బ్యానర్పై మూడో సినిమా చేస్తున్నాను. అంత పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం’’
ఫ్రెండ్స్ అయిపోయాం..:
‘‘హీరోయిన్ కశిక్ఖాన్ మంచి అమ్మాయి. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసింది. తనకు తెలుగు సరిగ్గా రాదు. అయినప్పటికీ నేర్చుకుని మరీ, డైలాగ్లు చెప్పింది. మేమిద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. అజయ్ అన్న కూడా ఇందులో మంచి పాత్ర పోషించారు. సెట్లో మేమంతా ఎంతో సరదాగా షూట్ చేశాం.’’
నాగచైతన్య సినిమా చూశారు కదా..:
‘‘ఇటీవల నాగచైతన్య ‘అనుభవించు రాజా’ సినిమా చూశారు. ఆయనకు మా సినిమా బాగా నచ్చింది. సినిమా పూర్తయ్యాక.. శ్రీనుతో అరగంట సేపు మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పారు’’
ఇదే కరెక్ట్ టైమ్..:
‘‘మా చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే దానిలో మేము ఎప్పుడూ ఆలోచన చేయలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలుంటాయి కాబట్టి ఆ సమయంలో వద్దనుకున్నాం. అలాంటి టైమ్లో నవంబర్లోనే విడుదల చేస్తే బాగుంటుందని భావించి నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది. -
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు