Kartikeya: రాజా విక్రమార్క వచ్చేస్తున్నాడు..!

‘చావు కబురు చల్లగా’ చిత్రం తర్వాత కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీసారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న...

Published : 20 Oct 2021 12:35 IST

హైదరాబాద్‌: ‘చావు కబురు చల్లగా’ చిత్రం తర్వాత కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీసారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ‘రాజా విక్రమార్క’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. నవంబర్‌ 12న ‘రాజా విక్రమార్క’ ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న సినిమాలో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కనిపించనున్నారు. ఇందులో కార్తికేయకు జోడీగా తన్యా రామచంద్రన్‌ సందడి చేయనున్నారు. సాయి కుమార్‌, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. రమా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని