RajaShekar: రాజ‘శేఖర్‌’ ఓటీటీకి వెళ్తోందా?

కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు ఇంకా పూర్తిస్థాయిలో ఆసక్తి చూపించని తరుణంలో.. పలు ఓటీటీ సంస్థలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి...

Published : 04 Dec 2021 01:18 IST

హైదరాబాద్‌: కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు ఇంకా పూర్తిస్థాయిలో ఆసక్తి చూపించని తరుణంలో.. పలు ఓటీటీ సంస్థలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన కొన్ని భారీ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. కాగా, తాజాగా ఇప్పుడు మరో కొత్త సినిమా డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌కే సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే ‘శేఖర్‌’.

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘శేఖర్‌’. ఆయన సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ‘శేఖర్‌’ను త్వరలోనే డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేయనున్నారని.. ఈ మేరకు పలు ఓటీటీ సంస్థల నుంచి చిత్రబృందానికి భారీ ఆఫర్లు వచ్చాయని టాక్‌. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రబృందం సైతం ఓటీటీ ఆఫర్ల పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని