Anubhavinchu raja Review: రివ్యూ: అనుభవించు రాజా
రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన ‘అనుభవించు రాజా’ ఎలా ఉందంటే..
చిత్రం: అనుభవించు రాజా; నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళి, నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా, తదితరులు; సంగీతం: గోపీ సుందర్; ఛాయాగ్రహణం: నాగేష్ బానెల్; కూర్పు: ఛోటా కే ప్రసాద్; సాహిత్యం: భాస్కర భట్ల, కళ: సుప్రియ బట్టెపాటి, రామ్ కుమార్ రచయిత; నిర్మాత: సుప్రియ యార్లగడ్డ; దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి; సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి; విడుదల: 26 నవంబర్ 2021
హుషారైన పాత్రలకి పెట్టింది పేరు రాజ్తరుణ్. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ తెరపై సందడి చేస్తుంటాడు. ఆరంభంలో మంచి విజయాలే అందుకున్నా.. అతడి సినిమాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించడం లేదు. తన శైలి పాత్రలో మరోసారి కనిపిస్తూ ‘అనుభవించు రాజా’ చేశాడు. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించేలా ఉండటం, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథేంటంటే: బంగారం అలియాస్ రాజు (రాజ్తరుణ్) పెద్దింట్లో పుట్టి పెరిగిన కుర్రాడు. తన తాత చివరి వరకూ సంపాదనకే పరిమితమై తనకంటూ జ్ఞాపకాలేమీ లేకుండా తనువు చాలిస్తాడు. తన చివరి క్షణాల్లో నువ్వైనా బాగా అనుభవించు అని మనవడికి చెప్పి ప్రాణాలు వదిలేస్తాడు. అప్పట్నుంచి బంగారం జల్సారాయుడిగా మారతాడు. అనుభవించడానికే పుట్టానన్నట్టుగా కోడిపందేలు, సరదాలతో కాలం వెల్లదీస్తుంటాడు. ఊరికి ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు. ఎన్నికల హడావుడిలో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఊళ్లో జల్సాగా బతికిన బంగారం సిటీలో సెక్యూరిటీ గార్డ్ ఎందుకయ్యాడు? శ్రుతి (కశిష్ఖాన్)తో అతడి ప్రేమాయణం ఎలా సాగిందన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే: పల్లెటూరు.. అక్కడి కొన్ని కుటుంబాలతో ముడిపడిన కథ ఇది. కామెడీ, డ్రామాకి అవకాశం ఉన్న కథనే రాసుకున్నారు దర్శకుడు. ప్రథమార్ధం హైదరాబాద్, ద్వితీయార్ధం పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. సెక్యూరిటీ గార్డ్గా కథానాయకుడు ఉద్యోగంలో చేరడం, అక్కడ కథానాయికతో పరిచయం కావడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం వంటి సన్నివేశాలతో సినిమాని సరదాగా నడిపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ సన్నివేశాల్లో అంత బలం లేకపోవడంతో పెద్దగా వినోదం పండలేదు. విరామ సమయంలో వచ్చే సన్నివేశాలు కథలో కీలక మలుపుకి కారణమవుతాయి. కథానాయకుడిలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ద్వితీయార్ధంలో ఫ్లాష్బ్యాక్ ఏదో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. కథ పల్లెటూరికి వెళ్లాకైనా కామెడీ డోస్ పెరుగుతుందేమో అని ఆశిస్తే అక్కడ కూడా నిరాశే. చూసేసిన కోడి పందేలు, ఒకే రకమైన సందడి. కాకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ కుటుంబంలోని డ్రామా, హత్య వెనక ఎవరున్నారనే విషయంపై రేకెత్తించిన ఆసక్తి ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా నవ్వించే కొన్ని సన్నివేశాలు, హుషారుగా సాగే పాటలే చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
ఎవరెలా చేశారంటే: రాజ్తరుణ్ బంగారం పాత్రలో ఓ జల్సారాయుడిలా చేసిన అల్లరి ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధంలో సెక్యూరిటీ గార్డ్ రాజుగా, సుదర్శన్తోనూ, కథానాయిక కశిష్ఖాన్తో కలిసి చేసిన సన్నివేశాలు కూడా సరదాగా అనిపిస్తాయి. అజయ్ పాత్ర, ఆయన నటన ఆకట్టుకుంటుంది. కథానాయిక కశిష్ఖాన్ అందంగా కనిపించింది. సాంకేతికంగా చూస్తే సినిమా పర్వాలేదనిపిస్తుంది. పాటలు, చిత్రీకరణ మెప్పిస్తుంది. దర్శకుడు శ్రీను గవిరెడ్డి రాసుకున్న కథలో బలం ఉంది కానీ, కథనం అంతగా మెప్పించలేదు. కామెడీ బలంగా పండకపోవడం కూడా సినిమాకి మైనస్గా మారింది. అంతర్లీనంగా ఊరి గురించి, జల్సాల గురించి, కుటుంబ బంధాల గురించి చెప్పిన సందేశం ఆకట్టుకుంటుంది. మాటలు కూడా బాగున్నాయి.
బలాలు
+ కొన్ని సరదా సన్నివేశాలు
+ కథ, పాటలు
+ క్లైమాక్స్
బలహీనతలు
-కథనం
-కామెడీ తగ్గడం
చివరిగా: ఈ బంగారంగాడిలో మెరుపుల్లేవు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు