#RAPO19: రామ్‌కి విలన్‌ ఇతడే

రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో రామ్‌కి విలన్‌గా కనిపించే నటుడ్ని ఖరారు చేసింది చిత్ర బృందం.

Published : 19 Jul 2021 13:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో రామ్‌కి విలన్‌గా కనిపించే నటుడ్ని ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకి ఆది పినిశెట్టి ఎంపికయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా చేస్తూనే ప్రతినాయక పాత్రలకు సై అంటుంటారాయన. ఈ క్రమంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో విలన్‌గా కనిపించి మంచి గుర్తింపు పొందారు. ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’ చిత్రాల్లో సహాయ నటుడిగానూ తనదైన ముద్రవేశారు. ఇప్పుడు రామ్‌తో తలపడేందుకు సిద్ధమవుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరగనున్నాయి. ఈ సినిమాలో రామ్‌ సరసన కృతి శెట్టి నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని