Rashmika: ‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. అందుకు నేనెంతో బాధపడుతున్నా: రష్మిక

‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన వల్ల తానెంతో బాధకు గురి అవుతున్నానని నటి రష్మిక అన్నారు. ఆదివారం సాయంత్రం జరిగి...

Published : 13 Dec 2021 13:59 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన వల్ల తానెంతో బాధకు గురయ్యానని నటి రష్మిక అన్నారు. ‘‘నిన్న సాయంత్రం జరిగిన ఈవెంట్‌ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈవెంట్‌లో తోపులాట జరగడం వల్ల కొంతమంది గాయపడ్డారని ఇప్పుడే నాకు తెలిసింది. అందుకు నాకెంతో బాధగా ఉంది. మీ అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని భావిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి’’ అని రష్మిక ట్వీట్‌ చేసింది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. సుకుమార్‌ దర్శకుడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ రోల్‌లో కనిపించనున్నారు. రష్మిక ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించారు. డిసెంబర్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆదివారం ముందస్తు విడుదల వేడుకలు నిర్వహించారు. రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు