SaiDharam Tej Republic Review: రివ్యూ: రిపబ్లిక్
సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఎలా ఉందంటే..
చిత్రం: రిపబ్లిక్; నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, పోసాని కృష్ణమురళి; ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్; సంగీతం: మణిశర్మ; కూర్పు: కె.ఎల్.ప్రవీణ్; స్క్రీన్ప్లే: దేవా కట్టా, కిరణ్ జయ్కుమార్; నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు; కథ, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా; సంస్థలు: జీస్టూడియోస్, జె.బి.ఎంటర్టైన్మెంట్స్; విడుదల: 1 అక్టోబర్ 2021
సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా.. ఆయన నటించిన సినిమా ‘రిపబ్లిక్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ప్రస్థానం’తో తనదైన ముద్రవేసిన దేవాకట్టా దర్శకుడు కావడం.. సాయితేజ్ యువ ఐఏఎస్ అధికారిగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలు సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. మరీ చిత్రం అందుకు తగ్గట్టుగా ఉందా..? తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..
కథేంటంటే: చిన్నప్పట్నుంచే తెలివైన విద్యార్థి పంజా అభిరామ్ (సాయిధరమ్ తేజ్). పెద్దయ్యాక వ్యవస్థని ప్రశ్నించడం మొదలుపెడతాడు. విదేశాలకి వెళ్లాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేసినా.. కాదని మరీ ఐఏఎస్ కావడం కోసం సన్నద్ధమవుతాడు. ఇదే క్రమంలో తన చుట్టుపక్కల జరిగిన కొన్ని సంఘటనలు అతడిని కలచివేస్తాయి. అనుకున్నట్టుగానే అభిరామ్ ఐఏఎస్ అవుతాడు. కొన్ని ప్రత్యేక అధికారాలతో ఏలూరు కలెక్టర్గా బాధ్యతలు చేపడతాడు. వెంటనే తెల్లేరు సరస్సు సమస్యపై దృష్టిపెడతాడు. కొన్నేళ్లుగా తెల్లేరుపై పెత్తనం చలాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకురాలు విశాఖవాణి (రమ్యకృష్ణ)తో అభిరామ్కి పోరాటం మొదలవుతుంది. న్యాయవ్యవస్థని, అధికార వ్యవస్థని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం చేస్తున్న విశాఖవాణి వల్ల ఎన్నారై మైరా (ఐశ్వర్యారాజేశ్)కి జరిగిన అన్యాయం ఏమిటి? తెల్లేరు విషయంలో జరిగిన పోరాటంలో గెలుపెవరిది? వ్యవస్థ మారడం కోసం అభిరామ్ చేసిన పోరాటం ఎలా సాగింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ప్రజాప్రతినిధులతో కూడిన శాసన వ్యవస్థ, బ్యూరోక్రాట్లతో కూడిన అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ.. ఈ మూడూ గుర్రాలైతే.. ప్రస్తుత పరిస్థితుల్లో వాటి గమనం ఎలా సాగుతోందో, అవి ఎలా ప్రయాణం చేస్తే వ్యవస్థ బాగుంటుందో సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు దేవా కట్టా. అపరిమితమైన అధికారాలు కొంతమంది వద్దే ఉంటే అది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇందులో ఆలోచన రేకెత్తించేలా చెప్పారు. పొలిటికల్ డ్రామాతో కూడిన ఓ నిజాయతీ ప్రయత్నం ఇది. ఆలోచనలు రేకెత్తించే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఓ యువ ఐఏఎస్ అధికారి పాత్రతో కుళ్లిపోయిన మన వ్యవస్థని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఓటు రిగ్ అయ్యిందంటూ సాధారణ యువకుడిగా కథానాయకుడు పోలింగ్ బూత్ దగ్గర ప్రశ్నించడం దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. ఆరంభ సన్నివేశాలు కాస్త నిదానంగా సాగినట్టు అనిపించినా, కథానాయకుడు ఐఏఎస్ అధికారి కావడం నుంచి అసలు కథ మొదలవుతుంది. తెల్లేరు కుళ్లు వెనక సంగతి, మైరా సోదరుడి హత్య కేసు, తెల్లేరు విషయంలో రైతుల పక్షాన ఉంటూ అభిరామ్ పోరాటం చేసే తీరు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధం నుంచే అసలు డ్రామా మొదలవుతుంది. వ్యవస్థలన్నింటినీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న విశాఖవాణికీ, అభిరామ్కీ మధ్య డ్రామా ఆకట్టుకుంటుంది. న్యాయ వ్యవస్థని కూడా ప్రభావితం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు అభిరామ్ వినిపించిన గళం, ఆ తర్వాత జరిగే పరిణామం పతాక సన్నివేశాల్లో హైలైట్. ఎన్కౌంటర్ల విషయాన్ని కూడా ఈ కథలో పలుమార్లు ప్రస్తావించారు. దర్శకుడు నిజాయతీగా కథని చెప్పే ప్రయత్నం చేశారు కానీ.. డ్రామా, కథనం సగటు సినీ ప్రేక్షకుడికి తగినంత అనుభూతిని పంచవు. తెలుగు తెరపై దర్శకుడు చేసిన ఓ కొత్త ప్రయత్నంగా మాత్రం ఈ చిత్రం గుర్తింపు పొందుతుంది.
ఎవరెలా చేశారంటే: సాయిధరమ్ తేజ్ ఈ కథని నమ్మి భుజానికెత్తుకోవడం అభినందించగదగ్గ విషయం. ఆయన యువ ఐఏఎస్ అధికారిగా చక్కగా ఒదిగిపోయారు. పరిణతితో కూడిన నటనని ప్రదర్శించాడు. జగపతిబాబు పాత్ర ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య రాజేశ్ ఓ ఎన్నారై యువతిగా కనిపిస్తుంది. రమ్యకృష్ణది బలమైన పాత్రే కానీ.. ఆ పాత్రని సరైన కోణంలో ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు. శ్రీకాంత్ అయ్యర్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాజు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మణిశర్మ సంగీతం ఆకట్టుకుంటుంది. సుకుమార్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. దర్శకుడు సంభాషణలు, కథ, మేకింగ్ పరంగా మెప్పించాడు. కథనం విషయంలో చేసిన కసరత్తులే సరిపోలేదనిపిస్తుంది.
బలాలు
+ కథ
+ సాయిధరమ్ తేజ్ నటన
+ సంభాషణలు
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు
- నిదానంగా సాగే సన్నివేశాలు
- కథనం
చివరిగా: వ్యవస్థలపై ఎక్కుపెట్టిన ‘రిపబ్లిక్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!