Dasara Bullollu: ఇమ్మాన్యుయేల్పై వర్ష ఫిర్యాదు.. రోజా సీరియస్!
బుల్లితెరపై జోడీగా కనిపించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇమ్మాన్యుయేల్, వర్ష. ఆన్స్క్రీన్పై ఎప్పుడూ తమ ప్రేమను వ్యక్తం చేసే ఈ జంట తొలిసారి కోపాన్ని ప్రదర్శించింది.
ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెరపై జోడీగా కనిపిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇమ్మాన్యుయేల్, వర్ష. ఆన్స్క్రీన్పై ఎప్పుడూ తమ ప్రేమను వ్యక్తం చేసే వర్ష తొలిసారి కోపాన్ని ప్రదర్శించింది. ఇమ్మాన్యుయేల్ ప్రవర్తనపై ప్రముఖ నటి రోజాకి వర్ష ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ‘దసరా బుల్లోళ్లు’ కార్యక్రమంలో చోటుచేసుకుంది. దసరా కానుకగా రూపొందిన ప్రత్యేక షో ఇది. అక్టోబరు 15న ‘ఈటీవీ’లో ప్రసారంకానుంది. తాజాగా ప్రోమో విడుదలైంది. ఆ సంగతులివీ..
‘పెళ్లి సందD’ సినిమా హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా మెరిశారు. ‘జబర్దస్త్’ నటులు అలనాటి చిత్రం ‘మాయా బజార్’ని రీక్రియేట్ చేసిన దృశ్యాలు కనువిందు చేశాయి. కృష్ణుడిగా గెటప్ శ్రీను, అభిమన్యుడిగా శేఖర్ మాస్టర్, శశిరేఖగా రోజా, శకునిగా ఆది, ఘటోత్కచుడిగా భాస్కర్ అలరించారు. ఈ క్రమంలో ఆది వేసిన పంచ్లు నవ్వులు పూయించాయి. ఈ తర్వాత ఓ డ్రామా మొదలవుతుంది. ‘చూడండి మేడమ్ నేను పక్కన ఉండగా మరో అమ్మాయిని తీసుకొచ్చాడు’ అని రోజాకి వర్ష ఫిర్యాదు చేసింది. ‘నేను ఆమెను ప్రేమించాను మేడమ్’ అని ఇమ్మాన్యుయేల్ గట్టిగా అరవగా రోజా సీరియస్ అయింది. ఈ హీట్ని తగ్గించేందుకు తన జీవితాన్ని వర్ష ఎలా మార్చేసిందో ఇమ్మాన్యుయేల్ వివరించే ప్రయత్నం చేశాడు. చివరిగా, అమ్మవారి (దుర్గ) అవతారంలో రోజా చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందడంతా చూడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM