NTR: జక్కన్న నోటి నుంచి ఒక్క ఎస్ వస్తే అది చాలు..
రామ్చరణ్-తారక్ ప్రధాన పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా...
జనగణమన వింటే ఇప్పటికీ ఏడ్చేస్తాను: రాజమౌళి
రాజమౌళి తర్వాత అలా ఓకే చెప్పింది సుకుమార్కే: చరణ్
హైదరాబాద్: రామ్చరణ్-తారక్ ప్రధాన పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్రబృందం ఫుల్ బిజీగా పాల్గొంటోంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తారక్, చరణ్, రాజమౌళి పాల్గొని ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
సినిమాని తెరకెక్కించే సమయంలో దేనిని మీరు పరిగణలోకి తీసుకుంటారు?
రాజమౌళి: ఎమోషన్. భావోద్వేగం ఉంటే ఏ సీన్ అయినా సరే కచ్చితంగా పండుతుందని నేను నమ్ముతాను. ‘ఆర్ఆర్ఆర్’లో కూడా ప్రతి ఫ్రేమ్లో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ‘నాటు నాటు’ మాస్ డ్యాన్స్ నంబర్ అనుకుంటారు. అది కేవలం డ్యాన్స్ నంబర్ మాత్రమే కాదు అందులో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. సినిమా విడుదలయ్యాక మీరు చూస్తారు.
మీ ఇద్దరు మంచి నటులు.. ఆవిషయం అందరికీ తెలుసు. దానిపై మీ అభిప్రాయం?
చరణ్: మా ఇద్దరి కంటే మా గురించి ఆయనకే ఎక్కువగా తెలుసు. అందుకే మమ్మల్ని ఈ అద్భుతమైన చిత్రంలో భాగం చేశారు. ఈ సినిమాలో నటించడం వల్ల మొదటిసారి నాకు నేను ఎంతో విభిన్నంగా, పవర్ఫుల్గా కనిపించాను. నటుడిగా నాలోని మరో కోణం నాక్కూడా తెలిసి వచ్చింది.
ఎన్టీఆర్: రాజమౌళి నాకు స్నేహితుడు మాత్రమే కాదు జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి. కెరీర్లో ఏం జరుగుతుందో కూడా తెలియని సమయంలో, సాధారణంగా ఉన్న నా జీవితాన్ని ఇంతలా మార్చింది అతనే. ఆయన వల్లే నేను మంచి నటుడిగా మారగలిగాను. ‘ఆర్ఆర్ఆర్’లో నేను పోషించిన పాత్ర ఎంతో క్లిష్టమైనది. ఆయన వల్లే ఆ పాత్ర చేయడం సాధ్యమైంది.
చరణ్: ప్రతిసారీ షాట్ అయ్యాక.. జక్కన్న నోటి నుంచి ఒక్క ఎస్ వస్తే అది చాలు మేము ఆనందపడే వాళ్లం.
ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయడం మీకు ఎలా అనిపించింది? మీరు ఏం చెప్పినా వీళ్లు చేస్తారు అనే భావన మీకు వచ్చిందా?
రాజమౌళి: ‘‘నేను ఏం చెప్పినా ఓకే చేస్తారు. నా సినిమాలో ఎవరైనా నటిస్తారు’’ అనే భావన వస్తే అదే నా పతనానికి నాంది అని నేను భావిస్తాను. నేను అలాంటి వాతావరణంలో పెరగలేదు. అలాంటి ఆలోచన నాలో లేదు. నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి రెండు పవర్ఫుల్ పాత్రలతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. సాధారణంగా మనకి దుర్యోధనుడు-కర్ణుడు, కృష్ణుడు-అర్జునుడు స్నేహితులని తెలుసు. కానీ, కృష్ణుడు-దుర్యోధనుడు స్నేహితులైతే ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన. అదే మాదిరిగా అల్లూరి, కొమురం భీమ్ ఆలోచన వచ్చినప్పుడు చరణ్-తారక్ అయితే నా పాత్రలకు న్యాయం చేయగలరని నమ్మకం వచ్చింది. మా మధ్య మంచి స్నేహం ఉంది. కథలో ఉన్న ఉత్సాహమే రెండున్నర సంవత్సరాలపాటు ఈ జర్నీ ఇలా సాగేలా చేసింది.
మీరు స్క్రీప్ట్ వినకుండానే ఈ కథ ఓకే చేశారని విన్నాం. ప్రతిసారీ స్క్రిప్ట్ వినరా?
చరణ్: ప్రతిసారీ ఇలా చేయను. రాజమౌళి కాబట్టే కథ వినకుండానే ఓకే చెప్పాను. మరో వ్యక్తి సుకుమార్. ఆయన తెరకెక్కించిన ‘రంగస్థలం’కు కూడా నేను కథ వినలేదు.
సన్నివేశాల విషయంలో జక్కన్న ఎంతో కచ్చితంగా ఉంటారని విన్నాం?
ఎన్టీఆర్: ఈ సినిమాలో ఓ కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది దాని కోసం ఆయన 65 సార్లు షూట్ చేశాడు. ఆయన ప్రతి విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. అప్పుడప్పుడూ మా ఆలోచనలు కూడా తీసుకుంటాడు.
రాజమౌళి సెట్లో ఎలా ఉంటాడు?
చరణ్: సెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఒకవేళ 24 క్రాఫ్ట్ల్లో ఎవరైనా సరిగ్గా చేయకపోతే వెంటనే ఆయనకు కోపం వచ్చేస్తుంది.
ఎన్టీఆర్: ఆయన టాస్క్ మాస్టర్. పర్ఫెక్షనిస్ట్.
రాజమౌళి: ప్రతి సన్నివేశానికి సంబంధించి నాలో ఒక ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరిగ్గా చేయకపోతే నా ఆలోచనకు తగినట్టు సీన్ రాదేమోనని భయపడుతుంటాను.
ఈ సినిమాలో ఎక్కువగా దేశభక్తి గురించి చూపించారా?
రాజమౌళి: ఇది దేశభక్తి చిత్రం కాదు. కేవలం స్నేహానికి సంబంధించిన సినిమా. దేశం, జాతి మీద గౌరవం ఉంది. ఇప్పటికీ జనగణమన వింటే నాకు కన్నీళ్లు ఆగవు. రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. అలా అని నేను వేరే దేశం వాళ్లని ఇష్టపడనని అర్థం కాదు. దేశభక్తి ఉంది. అదే విధంగా ఇతరుల్ని గౌరవించే సంస్కారం కూడా ఉంది.
మీరు ఎప్పుడైనా బడ్జెట్ గురించి ఆలోచించారా?
రాజమౌళి: డబ్బు కోసమే సినిమాలు చేస్తాం. ఒకవేళ మనం పెట్టుబడిపెట్టిన డబ్బులు కూడా రాకపోతే అది ఒక ఫెయిల్యూర్ కిందే లెక్క. కష్టం మొత్తం వృథా అయినట్టే. సినిమా తెరకెక్కిస్తున్న రోజుల్లో నాకు ఎప్పుడూ బడ్జెట్ గురించి ఆలోచన రాదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఖర్చు ఎంత అయ్యిందని చూస్తాను. సినిమా విడుదలయ్యాక నంబర్స్ గురించి ఆలోచిస్తా.
ఎన్టీఆర్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రేక్షకులకు చూపించాలనే ఆశలో మేము ఉన్నాం. నటులుగా మాలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ఇదొక మంచి చిత్రం. ఆడియన్స్ని తిరిగి థియేటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ట్రైలర్ చూస్తుంటే మీ అనుభూతి ఎలా ఉంది?
ఎన్టీఆర్: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ని మొదట హైదరాబాద్లో ఓ స్టూడియోలో చూశాం. ఆ తర్వాత ముంబయిలో పీవీఆర్ థియేటర్లో స్క్రీన్పై చూశాను. థియేటర్లో ట్రైలర్ చూస్తుంటే వావ్ అనిపించింది. చివరిసారిగా థియేటర్కు ఎప్పుడు వెళ్లానో కూడా గుర్తు లేదు. థియేటర్ అనుభూతి అదిరిపోయింది.
ఇండియన్ సినిమా అనే పదం చాలా బాగుంది. బాహుబలి తర్వాతే అది సాధ్యమైంది? ఫిల్మ్మేకర్గా ఆయన ఏమైనా మారాడా?
ఎన్టీఆర్: అవును. స్థానిక, స్థానికేతర అనే అడ్డంకులను ఆ సినిమా చెరిపేసింది. అందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఫిల్మ్మేకర్గా ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. ప్రపంచానికి తన కథలు, ఆలోచనలు చెప్పాలనే ఆకలితో ఆయన ఉన్నాడు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ వస్తాయని భావిస్తున్నారా?
చరణ్: తప్పకుండా.
ఎన్టీఆర్: ఇది ఇప్పుడు చెప్పొచ్చొ లేదో రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు కొనసాగుతోంది.కానీ మేమిద్దరం స్నేహితులం కూడా. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. మన దేశంలో ఎంతోమంది గొప్ప నటీనటులున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అందరూ ఒకే తాటి మీదకు వస్తారని.. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాలు వస్తాయని నా భావన. ఫిల్మ్మేకర్స్ అందుకు అనుగుణంగా వర్క్ చేస్తున్నారు. భాష అడ్డంకి అని నేను అనుకోను.
బాహుబలిలో ఓ సన్నివేశంలో శివగామి నదిలో మునిగిపోతూ బాబుని చేతితో పైకి ఎత్తారు. ఆ సీన్ వావ్ అనిపించింది. అసలు మీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి?
ఎన్టీఆర్: అవును నిజం. ఆ సీన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అలాగే ‘బాహుబలి-2’లో ఓ సాంగ్ ఉంటుంది. ఆ ఒక్క పాటలోనే ‘బాహుబలి’లో ఏం జరిగిందో చూపించేశాడు. అది చూస్తున్నంతసేపు.. ‘జక్కన్నకు ఎలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి’ అని అనిపించింది. సూపర్ ఐడియాస్.
రాజమౌళి: నాకు ఎప్పుడూ ఒకటే ఉంటుంది ప్రేక్షకుల్ని అలరించాలి. సినిమాలో సీన్స్ చూసి వాళ్లు వావ్ అనుకోవాలి. సీన్లో ఎమోషన్ని కూడా జోడించి చూపించినప్పుడే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నా భావన.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!