Chiranjeevi: మరోసారి స్టెప్పులతో ఇరగదీసిన మెగాస్టార్‌.. వీడియో చూశారా..!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆచార్య’. కొరటాలశివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాజాగా ‘ఆచార్య’ టీమ్...

Updated : 27 Dec 2022 19:17 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆచార్య’. కొరటాలశివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘ఆచార్య’ నుంచి మాస్‌ పార్టీ సాంగ్‌ ప్రోమో విడుదలైంది. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఆయనకు జంటగా రెజీనా సైతం డ్యాన్స్‌తో మెప్పించారు. రేవంత్‌-గీతామాధురి ఆలపించిన ఈ పూర్తి పాటను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు.

దేవాదాయ శాఖలోని అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆచార్య’ కోసం ‘ధర్మస్థలి’ పేరుతో భారీసెట్‌ ఏర్పాటు చేశారు. ఇందులోని కొన్ని సన్నివేశాల్లో మెగాస్టార్‌ నక్సలైట్‌గా కనిపించనున్నారు. అలాగే, రామ్‌చరణ్‌.. సిద్ధగా ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే స్క్రీన్‌ షేర్‌ చేసుకోగా సోనూసూద్‌ నెగెటివ్‌ షేడ్‌ రోల్‌లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని