Salman Khan: హైదరాబాద్‌ రాగానే బిరియానీ రుచి చూశా: సల్మాన్‌ ఖాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. అంతిమ్‌ సినిమా ప్రమోషన్‌ కోసం  కేపీహెచ్‌బీలోని ఫోరమ్‌ సుజనా మాల్‌కు విచ్చేసిన బాలీవుడ్‌

Updated : 01 Dec 2021 20:09 IST

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. ‘అంతిమ్‌’ ప్రచారం కోసం నగరంలోని ఓ మాల్‌కు విచ్చేసిన సల్మాన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై  నటిస్తూ నిర్మించిన చిత్రం ‘అంతిమ్‌’.  ఆయుశ్‌ శర్మ ముఖ్య పాత్రధారి. మహేశ్‌ ముంజ్రేకర్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌ 26న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. సల్మాన్‌ ఖాన్‌, ఆయుష్‌ శర్మ, డైరెక్టర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ...‘‘హైదరాబాద్‌ నాకు ఇష్టమైన ప్రదేశం. హైదరాబాద్‌ రాగానే బిరియానీ రుచి చూశా. ‘అంతిమ్‌’ అందరినీ మెప్పిస్తోంది. మళ్లీ వచ్చినప్పుడు కచ్చితంగా అభిమానులను కలుస్తా’’ అని సల్మాన్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని