Samantha: ఇకపై నా పనులు నేనే చేసుకోవాలి: సమంత

ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు తనని తాను మార్చుకుంటానని అగ్రకథానాయిక సమంత అంటున్నారు. ఇటీవల చై-సామ్ విడిపోతున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం వాళ్లిద్దరే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు. ఈ క్రమంలోనే...

Updated : 04 Oct 2021 14:52 IST

విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సామ్‌ పెట్టిన ఫస్ట్‌ పోస్ట్‌ 

హైదరాబాద్‌: ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు తనని తాను మార్చుకుంటానని అగ్రకథానాయిక సమంత అంటున్నారు. ఇటీవల చై-సామ్ విడిపోతున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం వాళ్లిద్దరే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో సమంత చేసిన తాజా పోస్ట్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్ధం చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మానేసి.. చేయాల్సిన పనులపైనే దృష్టి పెట్టాలి’ అని ఆమె ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు.

విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సామ్‌ చేసిన మొదటి పోస్ట్‌ ఇదే కావడంతో.. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్‌గా మారింది. దశబ్దకాలంపాటు ప్రేమ.. నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు అక్టోబర్‌ 2న నాగచైతన్య-సమంత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, వాళ్ల కుటుంబసభ్యులతోపాటు అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సామ్‌ ‘శాకుంతలం’, ‘కాతు వక్కుల రెందు కాదల్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని