Yashoda: ‘యశోద’ జోరు

సమంత ప్రధాన పాత్రలో హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌...

Updated : 26 Dec 2021 08:40 IST

మంత ప్రధాన పాత్రలో హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. తాజాగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఈనెల 6న చిత్రీకరణ ప్రారంభించాం. 24న తొలి షెడ్యూల్‌ను ముగించాం. ఈ షెడ్యూల్‌లో భాగంగా సమంత, వరలక్ష్మీ, సంపత్‌రాజ్‌, ఉన్ని ముకుందన్‌ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. జనవరి 3న రెండో షెడ్యూల్‌ ప్రారంభించి.. 12 నాటికి పూర్తి చేస్తాం. మూడో షెడ్యూల్‌ జనవరి 20 నుంచి మార్చి 31 వరకు నిర్విరామంగా జరుగుతుంది. దర్శకులు కొత్తవాళ్లయినా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సాంకేతిక పరంగా సినిమా అత్యున్నతంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని