Samantha: పుష్పరాజ్‌తో సమంత చిందు..!

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’తో ప్రేక్షకుల్ని అలరించిన సమంత-అల్లు అర్జున్‌ ఇప్పుడు మరోసారి స్క్రీన్‌పై మేజిక్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో సామ్‌...

Updated : 15 Nov 2021 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’తో ప్రేక్షకుల్ని అలరించిన సమంత-అల్లు అర్జున్‌ ఇప్పుడు మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘పుష్ప’ చిత్రంలోని ఐదో పాట ఎంతో ప్రత్యేకమైంది. ఈ స్పెషల్‌ సాంగ్‌కు స్పెషల్‌ వ్యక్తి ఉంటేనే బాగుంటుందనిపించింది. అలా సమంతను సంప్రదించాం. ఆమె వెంటనే ఓకే చేశారు’ అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తన కెరీర్‌లో సమంతకు ఇదే తొలి ఐటెమ్‌ సాంగ్‌ కానుంది.

 

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అల్లు అర్జున్‌ సరసన రష్మిక కనిపించనుంది. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని