Republic: ‘రిపబ్లిక్‌’ నుంచి రెండో పాట వచ్చేసింది..!

సాయిధరమ్‌ తేజ్‌, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా నటించిన రిపబ్లిక్‌ నుంచి రెండో పాట వచ్చేసింది. పాట ఎలా ఉందంటే..

Published : 06 Sep 2021 12:53 IST

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘సూడబోదమా.. ఆడబోదమా’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. హుషారెత్తించేలా ఉన్న ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, సాకీ శ్రీనివాస్ ఆలపించారు. ఈ పాటకు స్క్రీన్‌పై సాయిధరమ్‌ తేజ్‌ ఫుల్‌ మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకోనున్నారు.

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ సందడి చేయనున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని