Gamanam: శ్రియ అప్పుడెలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది: శర్వానంద్‌

‘శ్రియ నేనూ మంచి స్నేహితులం.  ఇద్దరం కలిసి ‘నువ్వా నేనా’ అనే చిత్రంలో నటించాం. తనలో ఎలాంటి మార్పులేదు.

Published : 09 Dec 2021 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘శ్రియ.. నేనూ మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి ‘నువ్వా నేనా’ అనే చిత్రంలో నటించాం. నాకు తనలో ఎలాంటి మార్పు కన్పించలేదు. ‘సంతోషం’ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉంది. నేను ఆమె అభిమానిని’ అని శర్వానంద్‌ అన్నారు. ‘గమనం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకి శర్వా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రియ ప్రధాన పాత్రలో సృజనా రావు రూపొందించిన చిత్రమిది. నిత్యా మేనన్‌, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘జ్ఞాన శేఖర్‌ ఓ సినిమాని నిర్మిస్తున్నానని నాతో చెప్పినప్పుడు వద్దు అని సలహా ఇచ్చా. కానీ, కథపై ఉన్న నమ్మకంతో తను ముందుకెళ్లాడు. ఓసారి ఆ కథని నాకు వినిపించాడు. వినగానే చాలా బాగా నచ్చేసింది. అదే ఈ ‘గమనం’. ఇలాంటి మంచి సినిమాల్లో భాగస్వామి అవ్వాలనిపిస్తుంటుంది. కానీ, వేరే కారణాల వల్ల నటించలేం. దర్శకురాలు సృజనా రావు ప్రతిభ ఏంటో నాకు తెలుసు. సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. అనంతరం శ్రియ గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు దేవ్‌కట్టా, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు అచ్చిరెడ్డి, రాజ్‌ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Cinema News and Telugu News





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని