Shyam Singha Roy: ‘శ్యామ్‌సింగ రాయ్‌’ ప్రేమగీతం.. వినసొంపుగా మిక్కీ సంగీతం

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్‌సింగ రాయ్‌’. రాహుల్‌ సాంక్రిత్యన్‌ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు.

Published : 25 Nov 2021 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్‌సింగ రాయ్‌’. రాహుల్‌ సాంక్రిత్యన్‌ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట విడుదలైంది. ‘ఏదో ఏదో’ అంటూ సాగే ఈ ప్రేమగీతానికి మిక్కీ జె. మేయర్‌ అందించిన వినసొంపైన సంగీతం అలరించేలా ఉంది. కృష్ణకాంత్‌ కాంత్‌ రచించిన ఈ పాటను చైత్ర అంబడిపుడి ఆలపించారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాసు పాత్రకు సంబంధించిన గీతమిది. శ్యామ్‌సింగ రాయ్‌ పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదలైన (టైటిల్‌ సాంగ్‌) పాటకు శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. వెంకట్‌ ఎస్‌. బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని