ShyamSinghaRoy: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో తాజాగా ‘శ్యామ్‌సింగరాయ్‌’ టీమ్‌ పాల్గొంది. జూబ్లీహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, నిర్మాత వెంకట్‌ మొక్కలు నాటారు....

Updated : 19 Dec 2021 13:42 IST

హైదరాబాద్: ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో తాజాగా ‘శ్యామ్‌సింగరాయ్‌’ టీమ్‌ పాల్గొంది. జూబ్లీహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, నిర్మాత వెంకట్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ ఛాలెంజ్‌ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి’’ అని అన్నారు. అనంతరం ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌ మారథాన్‌లో ఈ బృందం పాల్గొంది. జెండాలు ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని