Sunitha: డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానన్నారు.. ఆమె మాటతో బాగా ఏడ్చాను
తన మధురమైన స్వరంతో గాయకురాలిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుగువారికి చేరువైన తెలుగింటి ముద్దుగుమ్మ సునీత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల రామ్తో ఏడడుగుల బంధంలోకి...
హైదరాబాద్: తన మధురమైన స్వరంతో గాయకురాలిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుగువారికి చేరువైన తెలుగింటి గాయని సునీత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల రామ్తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
‘‘టీనేజీలో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి.. తన జీవితం ఓ అందమైన నవలలా ఉండాలని కలలుకంటుంది. తన కథలో తనే కథానాయిక కావాలని ఆశిస్తుంది. జీవిత భాగస్వామి తనని బాగా చూసుకోవాలని.. ప్రేమించాలని.. లాలించాలని.. ఊహల లోకంలో విహరిస్తుంటుంది. నా కెరీర్ ప్రారంభమైన కొత్తలో నేను కూడా అలాంటి ప్రపంచంలోనే ఉన్నాను. కానీ, మొదటి పెళ్లి తర్వాత నాకెన్నో విషయాలు తెలిసొచ్చాయి. అసలు జీవితమంటే ఏమిటో తెలిసింది. మొదటి పెళ్లి, బ్రేకప్ తర్వాత రామ్తో పెళ్లి జరిగే వరకూ సుమారు 15 సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఇంకెన్నో సమస్యలు చూశాను. నాకు తగిలిన దెబ్బలకు మనుషుల్ని నమ్మడం కూడా మానేశాను’’
‘‘రామ్ చాలా మంచి వ్యక్తి. పెళ్లి ప్రపోజల్తో నా వద్దకు వచ్చినప్పడు ‘నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే బాధపడతాను.. కానీ నా లైఫ్ మాత్రం ఎక్కడ ఆగదు’ అని చెప్పాడు. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చింది’’
‘‘చాలా మంది ఆడవాళ్లు నా గురించే తప్పుగా మాట్లాడుకున్నారు. నా బాధ్యతలన్ని ఎవరో వ్యక్తి చూసుకుంటున్నారని కామెంట్లు కూడా చేశారు. డబ్బు కోసమే రామ్ని పెళ్లి చేసుకున్నానన్నారు. ఆయనకు ఎంత ఆస్తి ఉందనే విషయం నాకు ఇప్పటికీ తెలియదు. ఆయన కంపెనీ టర్నోవర్ ఎంతో ఐడియా లేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరిపై ఒకరికి పరస్పరం గౌరవం ఉంది’’
‘‘నేను 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్లాను. ప్రోగ్రామ్లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మైక్ని చేతితో అందుకున్నాను. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఆయన సతీమణి నా వద్దకు వచ్చి.. ‘నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా?’ అని ప్రశ్నించింది. నేను షాకై.. ‘ఏమైంది ఆంటీ’ అని అడగ్గా.. ‘ఇందాక నువ్వు మైక్ తీసుకుంటూ ఆయన చేతిని తాకావు. ఆయనపై నీకున్న ఆలోచన ఏమిటి?’ అని అన్నారు. ఆ మాటకు బాగా ఏడ్చాను. ఇది ఒక్కటి మాత్రమే కాదు.. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో కామెంట్లు చూశాను. ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా’ అని సునీత వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్