RRR: ‘దోస్తీ’ సాంగ్.. అనిరుధ్, అమిత్ ఏమన్నారంటే
రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సింగర్స్ అనిరుధ్, అమిత్ త్రివేది అన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’....
హైదరాబాద్: రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సింగర్స్ అనిరుధ్, అమిత్ త్రివేది అన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘దోస్తీ’ ప్రమోషనల్ సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రమోషనల్ పాట కోసం ఐదు భాషలకు చెందిన ప్రముఖ గాయకులు హేమచంద్ర (తెలుగు), అనిరుధ్ (తమిళం), అమిత్ త్రివేది (హిందీ), విజయ్ ఏసుదాస్ (మలయాళం), యాజిన్ నైజర్ (కన్నడ)లను ఒకే తాటి మీదకు తీసుకువచ్చారు కీరవాణి. మరికొన్ని రోజుల్లో ‘దోస్తీ’ పాట సినీ ప్రియుల ముందుకు రానున్న నేపథ్యంలో అనిరుధ్, అమిత్.. కీరవాణితో కలిసి పనిచేయడం గురించి స్పందించారు.
‘చిన్నతనం నుంచి నాకు కీరవాణి సర్ అంటే ఎంతో అభిమానం. ఆయన పాటలంటే నాకెంతో ఇష్టం. ఆయన పాటలు ఎప్పుడు విన్నా సరే కొత్తగానే ఉంటాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం మొదటిసారి ఆయన కంపోజిషన్లో పనిచేసే అవకాశం నాకు లభించింది. ఐదు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు గాయకులం కలిసి లైవ్లో ఆ పాటను పాడి షూట్ చేశాం. ఇది ఒక అద్భుతమైన అనుభవం. రాజమౌళి, కీరవాణి, ఇతర చిత్రబృందానికి నా ధన్యవాదలు’ - అమిత్ త్రివేది
‘దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి సర్ మ్యూజిక్ కంపోజిషన్లో ప్రమోషనల్ సాంగ్లో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ స్నేహగీతం త్వరలో మీ అందరి ముందుకు రానుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు’ - అనిరుధ్ వివరించారు.
రామ్చరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్- రౌద్రం రణం రుధిరం’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ని చిత్రబృందం భారీగానే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ‘దోస్తీ’ పేరుతో ఓ ప్రమోషనల్ సాంగ్ను మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె