Sivasankar: ‘మగధీర’ పాటకు 22 రోజులు.. ‘అరుంధతి’ పాటకు 32 రోజులు!
కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని బలితీసుకుంది. ఎన్నో వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చి, తెలుగు, తమిళ భాషల్లో
ఇంటర్నెట్డెస్క్: డ్యూయెట్లు, మాస్ సాంగ్లకు డ్యాన్స్ కంపోజ్ చేయటం కాస్త సులభమే. అయితే, కొన్ని ప్రత్యేక పాటలకు నృత్యాలు సమకూర్చాలంటే అందులో ఎంతో అనుభవం ఉండాలి. డ్యాన్స్పై పట్టు ఉండాలి. పాట వెనుక అర్థం తెలిస్తేనే పాదం సరైన రీతిలో కదులుతుంది. అలాంటి వైవిధ్యమైన పాటకు నృత్యాలు సమకూర్చి మన్నలను పొందిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. అందుకే జాతీయ అవార్డు సైతం ఆయన డ్యాన్స్కు కదిలి వచ్చింది. అయితే, తన కెరీర్లో మర్చిపోలేని చిత్రాలు రెండు ఉన్నాయని శివ శంకర్ మాస్టర్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ రెండూ తెలుగు చిత్రాలు కావటం గమనార్హం. అందులో ఒకటి అనుష్క నటించిన ‘అరుంధతి’ ఒకటి కాగా.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ రెండోది. కరోనాతో ఆయన ఆదివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు చిత్రాల్లోని పాటలకు ఆయన శ్రమించిన విధానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..
‘అరుంధతి’ కోసం 32 రోజులు
కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘అరుంధతి’. 2009లో వచ్చిన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జేజేమ్మగా అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయితే, పశుపతిగా సోనూసూద్ నటన చూసి భయపడిపోయారు. క్షుద్రమాంత్రికుడైన సోనూసూద్ను అంతం చేయడానికి జేజేమ్మ అయిన అనుష్క చేసే డ్యాన్స్ సీక్వెన్స్ ఎవర్గ్రీన్. ‘భు భు భుజంగం.. ది ది తరంగం’ అంటూ సాగే ఆ పాటను తెరపై చూస్తుంటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. అలాంటి పాటకు నృత్యాలు సమకూర్చిన ఘనత శివ శంకర్ మాస్టర్ది. దాదాపు 32రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారట. ఆ పాటను ఎలా తెరకెక్కించాలో దర్శకుడు కోడి రామకృష్ణతో పాటు, నిర్మాత శ్యాంప్రసాద్.. శివ శంకర్ మాస్టర్కు ఊహాచిత్రాన్ని ఇచ్చారట. దీంతో అనుష్కకు ప్రాక్టీస్ చేయించడం ప్రారంభించారు. రష్యా నుంచి డూప్ను రప్పించి, అనుష్క ఎలా చేయాలో చేసి చూపించారు. ఆ సమయానికి అనుష్కకు పెద్దగా డ్యాన్స్ రాకపోయినా శివ శంకర్ మాస్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు నృత్య భంగిమలు నేర్పించారు. ఆ తర్వాత ఆమెకు డ్రస్ వేసి, చూసుకునే సరికే ఒకవారం రోజులు పట్టిందని శివశంకర్ ఓ సందర్భంలో చెప్పారు.
సాధారణంగా శివ శంకర్ మాస్టర్ ఒక పాటను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేవారట. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ధీర ధీర’ పాట పూర్తి చేయడానికి 22 రోజులు పట్టిందట. ఎందుకంటే ఆ పాటను కొంత భాగం రాజస్థాన్లో తీశారు. ఒక ప్రాంతంలో కేవలం ఉప్పు మాత్రమే ఉంటుంది. అక్కడ కొంత భాగాన్ని తెరకెక్కించారు. మళ్లీ ఏడాది తర్వాత రామోజీ ఫిల్మ్సిటీలో సెట్ వేసి, డ్యాన్సర్లతో సహా 15 రోజులు షూట్ చేశారట. అంత శ్రద్ధగా తెరకెక్కించారు కాబట్టే ఆ పాటకు జాతీయ అవార్డు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..