Radhe Shyam: ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’ నుంచి మరో సర్‌ప్రైజ్‌..!

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక.

Published : 08 Dec 2021 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే టీజర్‌, రెండు పాటల్ని (తెలుగు వెర్షన్‌) విడుదల చేయగా బుధవారం మరో గీతాన్ని (హిందీ వెర్షన్‌) విడుదల చేసింది. ‘సోచ్‌ లియా’ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్‌- పూజా జోడీ చూడముచ్చటగా ఉంది. మనోజ్‌ రచించిన ఈ గీతాన్ని మిథున్‌, అర్జిత్‌సింగ్‌ ఆలపించారు. మిథున్‌ స్వరాలు సమకూర్చారు. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని