సునీల్‌ రెడ్‌ అలర్ట్‌.. ఉపాసనతో నమ్రత

తన సినిమా చిత్రీకరణకు ముంబయి వెళ్లారు నటుడు మాధవన్‌. సెట్‌లో దిగిన ఫొటోని పంచుకుంటూ ‘మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

Updated : 19 Jul 2021 04:31 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

తన సినిమా చిత్రీకరణకు ముంబయి వెళ్లారు నటుడు మాధవన్‌. సెట్‌లో దిగిన ఫొటోని పంచుకుంటూ ‘మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

పారిస్‌లో నాకు నచ్చిన బ్రిడ్జి అంటూ అక్కడ దిగిన ఫొటోని షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌.

 రామేశ్వరాన్ని మిస్‌ అవుతున్నాని తెలిపింది నాయిక కీర్తి సురేశ్‌. గతంలో ఆ ప్రాంతంలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

‘మిమీ’ చిత్రంలోని తన పాత్ర కోసం కొంచెం బొద్దుగా మారింది కృతి సనన్‌. దానికి సంబంధించిన ఫొటోని చూపిస్తూ ‘నన్ను నేను గుర్తుపట్టలేదు’ అని అంటోంది.

‘రెడ్‌ అలర్ట్‌.. రాబోయే తుపాను గురించి వివరాలు తెలుసుకునేందుకు వేచి చూడండి’ అంటున్నారు నటుడు సునీల్‌. తన కొత్త సినిమా వివరాలకి సంబంధించి విశేషాలు పంచుకోనున్నారాయన.

రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన, మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌ తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఈ గ్రూప్‌ ఫొటోని షేర్‌ చేశారు నమ్రత. ఇలా మన సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..

































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని