Social Look: సోనూసూద్‌ ఎస్కలేటర్‌ స్టంట్‌.. రాశీఖన్నా నిద్ర

సినిమా తారలు అభిమానులతో పంచుకున్న ఆసక్తికర విషయాలు...

Updated : 17 Aug 2022 10:45 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తకర విషయాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సతీసమేతంగా గోవాకి వెళ్లిన మహేశ్‌ బాబు తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. తమ ప్రయాణ ఫొటోని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ అభిమానులతో పంచుకున్నారు. వీరితోపాటు మహేశ్‌ సోదరి మంజుల, దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు.

* ఎస్కలేటర్‌పై నిల్చోకుండా సోనూసూద్‌ ఓ స్టంట్‌ చేశారు. ‘దయచేసి మీరు ఇలా ప్రయత్నించకండి’ అని విజ్ఞప్తి చేశారు.

*  సినిమా చిత్రీకరణలకి బాగా కష్టపడుతూ సెలవు ఎప్పుడొస్తుందా? అనే ఆలోచనలో కునుకు తీసింది రాశీఖన్నా.

* తన వ్యాయామం పూర్తయ్యాక నటుడు ఆది సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు.

* కొవిడ్ మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు శిల్పాశెట్టితో కలిసి మనాలి వెళ్లినప్పటి ఫొటోని ప్రణీత షేర్‌ చేసింది.

* సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని రమ్యకృష్ణ విడుదల చేశారు. ఆ పోస్టర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఐశ్వర్య అభిమానులతో పంచుకుంది.

* ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని కార్లలో తమ ఇంటికి వేగంగా దూసుకెళ్లారు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌. సంబంధిత వీడియోను చిత్రబృందం పంచుకుంది. 






































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని