Cinema News: ‘మిస్సింగ్‌’.. మంచి థ్రిల్లర్‌

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్‌ నాయకా నాయికలుగా నటించిన చిత్రం ‘మిస్సింగ్‌’. శ్రీని జోస్యుల తెరకెక్కించారు. భాస్కర్‌ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా

Updated : 22 Oct 2021 07:24 IST

ర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్‌ నాయకా నాయికలుగా నటించిన చిత్రం ‘మిస్సింగ్‌’. శ్రీని జోస్యుల తెరకెక్కించారు. భాస్కర్‌ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్రంలోని ‘‘ఖుల్లమ్‌.. ఖుల్లాను’’ అనే గీతాన్ని దర్శకుడు క్రిష్‌ చేతుల విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో హర్షా మాట్లాడుతూ.. ‘‘మంచి థ్రిల్లర్‌ చిత్రమిది. కుటుంబంతో కలిసి హాయిగా   చూడగలిగేలా ఉంటుంది. మా ప్రయత్నం తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. శ్రీని అద్భుతంగా తెరకెక్కించార’’న్నారు నటుడు అశోక్‌ వర్థన్‌. నాయిక మిషా నారంగ్‌ మాట్లాడుతూ.. ‘‘థ్రిల్లింగ్‌, రొమాన్స్‌, సస్పెన్స్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రమిది. ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కింది’’ అంది. ‘‘ఈ చిత్రంలో మిస్‌ అయ్యేది నేనే. నా కోసం హీరో సహా.. మిగతా వాళ్లంతా వెతుకుతుంటారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అంది మరో నాయిక నికీషా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని