Gamanam: సుడులు తిరుగు నడి కడలిన..

శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనారావు తెరకెక్కించారు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 29 Nov 2021 10:19 IST

శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనారావు తెరకెక్కించారు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌, నిత్యా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ‘సాంగ్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో ఓ లిరికల్‌ గీతాన్ని హీరో నాగచైతన్య విడుదల చేశారు. ‘‘సుడులు తిరుగు నడి కడలిన.. పడవ నడపమని అడగాలా. పిడుగు పడిన ప్రతి క్షణమున.. అడుగు నిలపమని అడగాలా’’ అంటూ మనసులను హత్తుకునేలా సాగుతున్న ఈ మెలోడీ గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. కైలాష్‌ ఖేర్‌ ఆలపించారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జ్ఞాన శేఖర్‌ వి.ఎస్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని