Akhanda: బోయపాటి- బాలకృష్ణ.. ఒకటికి మించి మరొకటి ‘అఖండ’ విజయం
2021 డిసెంబరు 2.. థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్న రోజు. తెలుగు సినిమా ప్రియులు మర్చిపోలేని రోజు. బాలకృష్ణ అభిమానుల ఆనందం ఆకాశన్నంటిన రోజు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్కు తిరుగులేదని మరోసారి నిరూపితమైన రోజు. ఇది ‘అఖండ’మైన రోజు.
ఇంటర్నెట్ డెస్క్: 2021 డిసెంబరు 2.. థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్న రోజు. తెలుగు సినిమా ప్రియులు మర్చిపోలేని రోజు. బాలకృష్ణ అభిమానుల ఆనందం అంబరాన్ని తాకిన రోజు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్కు తిరుగులేదని మరోసారి నిరూపితమైన రోజు. ఇది ‘అఖండ’మైన రోజు.
ఓ వైపు కరోనా భయం.. మరోవైపు ఓటీటీల వినియోగం కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. అలాంటి పరిస్థితుల్లో కొందరి ప్రముఖ హీరోల చిత్రాలు కాస్త ఊరటనిచ్చాయి. కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగాయి. ఆ ధైర్యంతోనే కథాబలం ఉన్న చిన్న చిత్రాలూ సినిమా హాళ్లలోనే సందడి చేశాయి. ‘ఇలాంటి సమయంలో ఒక అగ్ర హీరో చిత్రం విడుదలైతే మరింత జోష్ వస్తుంది. మిగతా చిత్రాల విడుదలా సుగమం అవుతుంది’ అని అటు చిత్ర పరిశ్రమ, ఇటు థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. దానికి ‘అఖండ’ చిత్రం నాంది పలికింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. రవీందర్ రెడ్డి నిర్మించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ, బీ, సీ..ఇలా సెంటర్ ఏదైనా, ఆంధ్రా, సీడెడ్, నైజాం... ఏరియా ఏదైనా ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లకు కొత్త వెలుగును తీసుకొచ్చింది. అయితే, బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్కు ఇది కొత్తేం కాదు. గతంలోనూ ఈ కాంబో రెండుసార్లు రికార్డు సృష్టించింది.
సింహా గర్జన..
బోయపాటి శ్రీను ‘భద్ర’, ‘తులసి’ చిత్రాలతో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. 2009లో బాలకృష్ణ హీరోగా తన మూడో సినిమా ‘సింహా’ని ప్రకటించారు. ఆ సమయానికి ఈ ఇద్దరి కాంబినేషన్పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది కానీ అంతగా అంచనాలు లేవు! పోస్టర్లు, పాటలు మెల్లమెల్లగా సినిమాపై చర్చించుకునేలా చేశాయి. 2010 ఏప్రిల్ 30న సినిమా విడుదలై కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ‘బాలకృష్ణని ఎలా చూపించాలో, ఆయన స్టామినా ఏంటో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు’ అని అందరితోనూ అనిపించేలా చేసింది. ఈ సినిమాలో శ్రీమన్నారాయణగా, డా. నరసింహగా బాలకృష్ణ అభినయం అద్వితీయం. ఈ చిత్రం 338 కేంద్రాల్లో 50 రోజులు, 92 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది.
తిరుగులేని లెజెండ్
‘సింహా’ ఊహించని సంచలనం సృష్టించటంతో ఈ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని అందుకుంటూ 2014 మార్చి 28న బాలకృష్ణ ‘లెజెండ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జయదేవ్ (లెజెండ్), కృష్ణ పాత్రల్లో కనిపించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా 31 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమైంది. ఓ థియేటర్లో 1000 రోజులు ప్రదర్శితమైన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
అఖండతో హ్యాట్రిక్
రెండు సినిమాలు సూపర్హిట్ అందుకుంటే మూడో చిత్రంపై నెలకొనే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రేక్షకులు ఆశించే ఔట్పుట్ ఇచ్చేందుకు దర్శకుడు, నటుడూ ఎంతో కసరత్తు చేయాలి. అలా బోయపాటి శ్రీను, బాలకృష్ణ పడిన కష్టమే ఇప్పుడు థియేటర్లలో హంగామా చేస్తున్న ‘అఖండ’ చిత్రం. ఈ సినిమాలోనూ బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషించారు. మురళీకృష్ణగా, శివుడుగా నటనలో విజృంభించారు. సగటు సినీ ప్రేక్షకుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరి మన్ననలు పొందుతున్నారు.
మూడు చిత్రాల్లోనూ..
ఈ మూడు చిత్రాల్లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ప్రతి సినిమాలోనూ విలన్ పాత్రలు చాలా కీలకంగా నిలిచాయి. బాలకృష్ణ చెప్పిన సంభాషణలు అద్భుతమనిపించాయి.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ