SPBALU: నూరు గళాల స్వరార్చన

వంద పాటలు... వంద మంది గాయనీ గాయకులు... ఓ వేదిక. ‘గాన గంధర్వుడి నూరు గళాల స్వరార్చన’ పేరుతో నిర్వహించనున్న ఈ ఘట్టం సంతోషం - సుమన్‌ టీవీ సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవ వేదికపై

Updated : 31 Oct 2021 09:06 IST

వంద పాటలు... వంద మంది గాయనీ గాయకులు... ఓ వేదిక. ‘గాన గంధర్వుడి నూరు గళాల స్వరార్చన’ పేరుతో నిర్వహించనున్న ఈ ఘట్టం సంతోషం - సుమన్‌ టీవీ సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవ వేదికపై ఆవిష్కృతం కానుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన 40 వేల పైచిలుకు పాటల్లోని ఆణిముత్యాల్ని ఈ వేదికపై వంద మంది గాయకులు ఆలపించనున్నారు. నవంబర్‌ 14న మధ్యాహ్నం 3 గంటలకి ఈ స్వరార్చన ప్రారంభం అవుతుందని పురస్కార ప్రదానోత్సవ నిర్వాహకులు సురేష్‌ కొండేటి ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని