Akhanda Pushpa: ‘అఖండ’,‘పుష్ప’.. త్వరలోనే ఆ ఓటీటీల్లోకి ?

ఓటీటీలోకి ‘అఖండ’, ‘పుష్ప’ చిత్రాలు. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి.

Updated : 04 Jan 2022 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2021 డిసెంబరులో విడుదలైన ‘అఖండ’, ‘పుష్ప’ చిత్రాలు ఊహించని రికార్డులు సృష్టించాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత అత్యధిక మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన సినిమాలుగా నిలిచాయి. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాల డిజిటల్‌ ప్రసారం గురించి టాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు రెండు వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కానున్నాయని ప్రచారం సాగుతోంది. ‘పుష్ప’.. ‘అమెజాన్‌ ప్రైమ్‌’ వేదికగా జనవరి 7 నుంచి, ‘అఖండ’.. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ వేదికగా జనవరి 14 నుంచి సందడి చేయబోతున్నాయని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అఖండ’. అఘోరా, మురళీకృష్ణ పాత్రల్లో బాలకృష్ణ విశేషంగా ఆకట్టుకున్నారు. నాయికగా ప్రజ్ఞా జైస్వాల్‌, ప్రతినాయకుడిగా శ్రీకాంత్‌ అలరించారు. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని  అల్లు అర్జున్‌ మ్యానరిజం తెలుగు ప్రేక్షకులతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని