SrideviDramaCompany: ఓ వైపు వినోదం.. మరోవైపు దేశభక్తి

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం అలరించే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీ ప్రసారమవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఎపిసోడ్‌ ఆగస్టు 15న ప్రసారం కానుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Published : 10 Aug 2021 23:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం అలరించే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఎపిసోడ్‌ ఆగస్టు 15న ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘వర్షం’ పాటల డ్యాన్సులు, దేశభక్తి గీతాలు, కామెడీ సన్నివేశాలతో ఆద్యంతం అలరిస్తుంది ఈ ప్రోమో. ప్రముఖ నటి ఆమని అతిథిగా మెరిశారు. సుధీర్‌పై ఆమె వేసిన పంచ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. ‘ఈ వర్షం సాక్షిగా’ పాటకి నలుగురు కంటెస్టెంట్లు చేసిన డ్యాన్సు చూపరుల్ని కట్టిపడేసేలా ఉంది. సునామీ సుధాకర్‌ బొమ్మగా నటించి మెప్పిస్తున్నాడు. ఈ బొమ్మతో మాట్లాడించే వ్యక్తిగా బుల్లెట్‌ భాస్కర్‌ కనిపించి, సందడి చేశాడు. సుధాకర్‌-భాస్కర్‌ సంభాషణ అలరిస్తున్నాయి. వీళ్ల మధ్యలో ఆది, నరేశ్‌ ఎంట్రీ ఇచ్చి కామెడీ పండించారు. మరోవైపు.. పలువురు గాయకులు ‘వందేమాతరం’ గీతం ఆలపించి స్ఫూర్తిని రగిలించారు. మానవత్వం ముందు మతాలు, కులాలు, ప్రాంతాలు ఏవీ పనికిరావని తన స్కిట్‌తో నిరూపించి, అందరి హృదయాన్ని హత్తుకుంటున్నాడు రామ్‌ ప్రసాద్‌. మరి సందడంతా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసేయండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని