Biggboss Season5: బిగ్బాస్ హౌస్లో కొత్త కెప్టెన్గా శ్రీరామచంద్ర
ఎంతో ఉత్కంఠ సాగిన బిగ్బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ‘నెగ్గాలంటే తగ్గాల్సిందే’లో విజయం సాధించి సన్నీ-మానస్, శ్రీరామచంద్ర-హమీద, శ్వేతావర్మ-అనీమాస్టర్ జోడీలు కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించారు...
హైదరాబాద్: ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ‘నెగ్గాలంటే తగ్గాల్సిందే’లో విజయం సాధించి సన్నీ-మానస్, శ్రీరామచంద్ర-హమీద, శ్వేతావర్మ-అనీమాస్టర్ జోడీలు కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించారు. ఈ టాస్క్లో సన్నీ-మానస్ల జోడీ అత్యధికంగా బరువు తగ్గింది. వీళ్లిద్దరూ ఏకంగా 10 కిలోల తగ్గారు. మానస్ ఒక్కడే ఆరు కిలోల బరువు తగ్గడం విశేషం. అర్హత సాధించిన జోడీలో ఒకరు కెప్టెన్ పోటీదారులుగా బరిలో నిలబడాల్సి ఉంటుందని.. వాళ్లెవరో తేల్చుకుని సంచాలకురాలు కాజల్కు చెప్పాలని బిగ్బాస్ సూచించాడు. కెప్టెన్ పోటీలో ఎవరు నిలబడాలన్న అంశంపై మూడు జోడీల మధ్య చర్చ బాగానే నడిచింది. మానస్ సన్నీకి మద్దతు ఇవ్వగా.. అనీ మాస్టర్ శ్వేతావర్మలు ‘కుషన్ టాస్’ రూపంలో కెప్టెన్ పోటీదారులను ఎంచుకుని సింపుల్గా తేల్చేశారు. తన తెలివితేటలతో హమీదాను ఒప్పించి శ్రీరామ కెప్టెన్ పోటీదారుడిగా రంగంలోకి దిగారు.
దీంతో శ్రీరామ్, శ్వేతావర్మ, సన్నీల మధ్య కెప్టెన్సీ పోటీ నెలకొంది. తమకు ఇష్టంలేని, కెప్టెన్ అయ్యేందుకు అర్హత లేని వ్యక్తిని ఎంచుకుని.. అతని నడుముకు కట్టిన బెల్ట్లో కత్తిని గుచ్చాలని బిగ్బాస్ సూచించాడు. సన్నీకి అత్యధికంగా కత్తిపోట్లు దిగాయి. నీకు కత్తి గుచ్చాలని లేదని ఒకరు.. నీకు ఇప్పుడే కెప్టెన్ అయ్యే అర్హత లేదని మరొకరు.. కెప్టెన్ అంటే కమాండర్లా ఉండాలని ఇంకొకరు సన్నీకి కత్తులు దింపారు. ఎక్కువమంది కత్తులు దింపడంతో సన్నీ బాధపడ్డాడు. ‘నాకేం రీజన్ లేదు..’ అంటూ సైలెంట్గా లోబో దింపిన కత్తికి సన్నీ విచారం వ్యక్తం చేశాడు. శ్వేతావర్మ బెల్ట్కు హమీదా, కాజల్, మానస్లు కత్తులు గుచ్చారు. శ్రీరామచంద్రకు అనీమాస్టర్ ఒక్కరే కత్తిపోటు గుచ్చారు. దీంతో శ్రీరామచంద్ర కొత్త కెప్టెన్ అయ్యాడు.
హౌస్లో ఎవరు బెస్ట్.. ఎవరు వరస్ట్ పెర్ఫార్మరో చెప్పాలని ఇంటి సభ్యులకు బిగ్బాస్ సూచించాడు. మరి ఇంట్లో బెస్ట్ ఎవరో, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో తెలియాలంటే శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..