Arjuna phalguna: ‘అర్జున ఫల్గుణ’.. విడుదల ఖరారు

శ్రీవిష్ణు కథానాయకుడిగా తేజ మర్ని తెరకెక్కించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అమృతా అయ్యర్‌ కథా నాయిక. ఈ సినిమా నూతన సంవత్సరం సందర్భంగా

Updated : 17 Dec 2021 10:57 IST

శ్రీవిష్ణు కథానాయకుడిగా తేజ మర్ని తెరకెక్కించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అమృతా అయ్యర్‌ కథా నాయిక. ఈ సినిమా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘‘శ్రీవిష్ణు శైలికి తగ్గ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. పసందైన వినోదాన్ని పంచిస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. త్వరలో మిగిలిన పాటలు, ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాలో నరేష్‌, శివాజీ రాజా, దేవీ ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ స్వరాలందించారు. జగదీష్‌ చీకటి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని