Cinema News: పార్టీల్లో ఎంజాయ్‌ చేసిన సమంత, పూరీజగన్నాథ్‌, ఆర్జీవీ

వరుస సినిమా షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండే సెలబ్రిటీలందరూ వారాంతంలోనైనా కాస్త సేదతీరడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేందుకు పార్టీలకు హాజరై ఎంజాయ్‌ చేస్తుంటారు....

Published : 21 Sep 2021 01:29 IST

ఫొటోలు షేర్‌ చేసిన సెలబ్రిటీలు

హైదరాబాద్‌: వరుస సినిమా షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండే సెలబ్రిటీలందరూ వారాంతంలోనైనా కాస్త సేదతీరడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేందుకు పార్టీలకు హాజరై ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ బర్త్‌డే, వీకెండ్‌ పార్టీలతో ఎంజాయ్‌ చేశారు. ఇంతకీ ఎవరా తారలు? ఏమా పార్టీలు..?


సమంత-కీర్తి-త్రిష

దక్షిణాదిలో అగ్రకథానాయికలుగా పేరుపొందిన నటీమణులు కీర్తిసురేశ్‌- సమంత. తాజాగా వీరిద్దరూ ఓ పార్టీ చేసుకున్నారు. ‘కాతు వక్కుల రెందు కాదల్‌’ సినిమా పనులతో బిజీగా ఉంటోన్న సామ్‌.. కొంత విరామం తీసుకుని కీర్తిసురేశ్‌, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌లను కలిసి ఓ సాయంత్రం వేళ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా సమంత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ఆ రోజు ఎంతో సరదాగా గడించిందని పేర్కొంది.


అషు రెడ్డి బర్త్‌డే పార్టీలో నిఖిల్‌, ఆర్జీవీ

డబ్‌స్మాష్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అషురెడ్డి. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’తో ఫామ్‌లోకి వచ్చిన అషురెడ్డి ప్రస్తుతం పలు షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కాగా, ఆదివారం ఆమె పుట్టినరోజు వేడుకలు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు నటుడు నిఖిల్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, ఆరియానా, రాహుల్‌ సిప్లిగంజ్‌ హాజరై సందడి చేశారు.


పూరీ-ఛార్మి-ఆలీ దంపతులు

ప్రస్తుతం ‘లైగర్‌’ షూట్‌లో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నిర్మాత ఛార్మి. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈసినిమా షూటింగ్‌ గత కొన్నిరోజుల నుంచి గోవాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్‌లో ఆలీ సందడి చేశారు. తన సతీమణితో కలిసి పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రమ్యకృష్ణలను కలిశారు. అనంతరం, వారితో కలిసి భోజనం చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని