దుబాయ్‌లో పార్టీ చేసుకున్న స్టార్‌ హీరోలసతీమణులు..!

స్టార్‌హీరోలు మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌.. వాళ్ల సతీమణులు నమ్రత-ఉపాసన  వ్యక్తిగతంగా మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. మహేశ్‌ నివాసంలో జరిగే పలు సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్...

Updated : 25 Dec 2021 11:50 IST

త్వరలో హైదరాబాద్‌లో వేడుకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు సతీమణి నమ్రత, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. మహేశ్‌ నివాసంలో జరిగే వేడుకలకు రామ్‌చరణ్‌ - ఉపాసన హాజరవుతుంటారు. ప్రస్తుతం ఈ హీరోలిద్దరూ తమ తదుపరి ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండగా.. వాళ్ల సతీమణులు దుబాయ్‌లో సందడి చేశారు. ‘దుబాయ్‌ ఎక్స్‌పో 2020’లో భాగంగా అక్కడికి వెళ్లిన వీళ్లు క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకొన్నారు. నమ్రత, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్ర తదితరులకు ఉపాసన ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘‘ఇష్టమైన స్నేహితులతో రుచికరమైన భోజనం. నాకెంతో ఇష్టమైనవారితో దుబాయ్‌లో ఈ మధ్యాహ్నం సరదాగా గడిచింది. ఉపాసన.. అద్భుతమైన వంటకాలతో నీలా విందు ఎవ్వరూ ఇవ్వలేరు. మనీశ్‌.. ఈరోజు నిన్ను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుకలే త్వరలో హైదరాబాద్‌లో మనందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్‌’’ అని నమ్రత పోస్ట్‌ పెట్టగా.. ‘‘సమయం ఎంతో సరదాగా గడిచిపోయింది. అతిత్వరలోనే మనం మళ్లీ హైదరాబాద్‌లో ఇలాగే కలుసుకోవాలి’’ అని ఉప్సీ రిప్లై ఇచ్చారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని