Gully Rowdy Review: రివ్యూ: గల్లీరౌడీ
Gully Rowdy: సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’ ఎలా ఉందంటే?
చిత్రం: గల్లీ రౌడీ; నటీనటులు: సందీప్ కిషన్, నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: రామ్ మిర్యాల, సాయి కార్తిక్; సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్; ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్; రచన: నందు; నిర్మాత: కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ; బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్; స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి; విడుదల: 17-09-2021
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న యువ కథానాయకుల్లో సందీప్కిషన్ ఒకరు. ఆయన ‘తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్’ తర్వాత మరోసారి జి.నాగేశ్వర్రెడ్డి కాంబినేషన్లో చేసిన చిత్రం ‘గల్లీరౌడీ’. దీని వెనక కోనవెంకట్లాంటి సీనియర్ రచయిత కూడా ఉండటంతో సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలు కూడా అంచనాలు పెంచాయి. మరి అందుకు తగ్గట్టు సినిమా ఉందా? ‘గల్లీరౌడీ’గా సందీప్ చేసిన హంగామా ఏంటి?
కథేంటంటే: విశాఖలో ఒకప్పుడు పేరు మోసిన రౌడీ సింహాచలం(నాగినీడు). తన వైభవం కోల్పోయాక, తన కొడుకు మరణించాక ఎలాగైనా తన మనవడు వాసు (సందీప్కిషన్)ని రౌడీని చేయాలని నిర్ణయిస్తాడు. తన శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పెంచుతాడు. కానీ, వాసుకేమో రౌడీయిజం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సాహిత్య (నేహాశెట్టి)ను చూసి ప్రేమలో పడతాడు. అదే సమయంలో ఆమెకీ, ఆమె కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. అందుకోసం ‘గల్లీరౌడీ’గా చలామణీ అవుతున్న వాసుని ఆశ్రయిస్తుంది. ఇంతకీ సాహిత్య కుటుంబానికి వచ్చిన సమస్య ఏమిటి అందుకోసం వాసు ఏం చేశాడు? రౌడీ అయ్యి, శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలన్న తాత కోరికని ఎలా నెరవేర్చాడన్నదే కథ.
ఎలా ఉందంటే: ఎలాంటి కొత్తదనం లేని కథ, కథనాలతో రూపొందిన చిత్రమిది. నవ్వించడమే ప్రధానంగా సన్నివేశాల అల్లిక కనిపిస్తుంది. నటీనటుల అనుభవం, రచనా ప్రభావం వల్ల ఆ ప్రయత్నం కొంతమేర నెరవేరినట్టు అనిపించినా, మిగిలిన విషయాల్లో సినిమా ఏమాత్రం ఆసక్తిని పంచలేదు.. లాజిక్ లేని సన్నివేశాలతో.. ఏ మాత్రం భావోద్వేగాలు పండించని డ్రామాతో సింహ భాగం సినిమా నీరసంగా సాగుతుంది. మేకింగ్ పరంగా సినిమా తీయడంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ, ఈ సినిమాని చూస్తే గల్లీరౌడీ స్కూల్కి వెళ్లే రోజుల్లో రావల్సిన చిత్రం అనిపిస్తుంది. ప్రథమార్ధంలో కిడ్నాప్ డ్రామా ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. విరామ సన్నివేశాలు మెప్పిస్తాయి. ద్వితీయార్ధంలో రవినాయక్గా బాబీ సింహా ఎంట్రీ ఇచ్చాకైనా కథలో సీరియస్నెస్ కనిపిస్తుందేమో అనుకుంటే, ఆ పాత్రని కూడా డమ్మీగా మార్చేశారు. అసలు ఆ పాత్రని పరిచయం చేసిన విధానం ఓ రేంజ్లో ఉంటుంది కానీ, ఆ ప్రభావం ఆ తర్వాత కనిపించదు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, షకలక శంకర్ తదితరులు చేసే సందడే అక్కడక్కడా నవ్వించింది. నాయకానాయికల మధ్య ప్రేమ సన్నివేశాల్లోనూ బలం లేదు. అటు నవ్వించలేక, ఇటు ఆసక్తిని రేకెత్తించలేక, భావోద్వేగాలూ పండక సినిమా సో సో అనిపిస్తుంది. కోన వెంకట్, జి.నాగేశ్వర్రెడ్డి వంటి సీనియర్లు స్ర్కీన్ప్లే రాసినా అది సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు.
ఎవరెలా చేశారంటే: సందీప్కిషన్ తన నటనతో ఆకట్టుకుంటాడు. వాసు పాత్రలో సులభంగా ఒదిగిపోయాడు. పోరాట ఘట్టాలపై చక్కటి ప్రభావం చూపించాడు. రాజేంద్రప్రసాద్ నటన స్పెషల్. సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆయన తనదైన అనుభవంతో మామూలు సన్నివేశాల్లోనూ నవ్వించారు. నేహాశెట్టి అందంగా కనిపించింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్, షకలక శంకర్ తదితరులు చేసిన సందడి కూడా నవ్వించింది. మిమి గోపి ప్రధాన ప్రతినాయకుడిగా నటించాడు. ద్వితీయార్ధంలో బాబీ సింహా పాత్రే కీలకం. సాంకేతిక విభాగాల్లో సాయివెంకట్, చౌరస్తా రామ్ సంగీతం మెప్పిస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కథలో కొత్తదనం లేదు. అక్కడక్కడా మాటలు మెప్పిస్తాయి. దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి పాత కథని, అదే రకమైన పాత పద్ధతుల్లో నడిపారు.
బలాలు
+ కొన్ని హాస్య సన్నివేశాలు
+ విరామ సన్నివేశాలు
బలహీనతలు
- కథ, కథనం
- భావోద్వేగాలు లేకపోవడం
- ద్వితీయార్ధంలో సాగదీత
చివరిగా: ఈ ‘రౌడీ’ ఇంకా అవే ‘గల్లీ’లు పట్టుకుని తిరుగుతూ ఉండిపోయాడు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా