Sundeep Kishan: కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించిన సందీప్‌

‘గల్లీరౌడీ’తో మంచి టాక్‌ సొంతం చేసుకుని ఇప్పుడు అదే జోష్‌లో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించారు నటుడు సందీప్‌ కిషన్‌. ఆయన హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది....

Published : 19 Sep 2021 12:47 IST

హైదరాబాద్‌: ‘గల్లీరౌడీ’తో మంచి టాక్‌ సొంతం చేసుకుని ఇప్పుడు అదే జోష్‌లో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించారు నటుడు సందీప్‌ కిషన్‌. ఆయన హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఆదివారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. హీరోలు నాగశౌర్య, అల్లరి నరేశ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌ చిత్రీకరణలో హీరో హీరోయిన్లపై నరేశ్‌ క్లాప్‌ కొట్టగా.. నాగశౌర్య కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో సందీప్‌కు జోడీగా నటి కావ్య థాపర్‌ సందడి చేయనున్నారు. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యూలర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ‘టైగర్‌’ తర్వాత ఆనంద్‌-సందీప్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని