MAA Elections: వ్యక్తిగత లాభం కోసం మోహన్బాబు ఎప్పుడూ మాట్లాడలేదు: తలసాని
సాధారణ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఈసారి ‘మా’ ఎన్నికలు జరిగాయని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో...
హైదరాబాద్: సాధారణ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఈసారి ‘మా’ ఎన్నికలు జరిగాయని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి తలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణుని ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘మా’ అభివృద్ధి కోసం మంచు విష్ణు చేపట్టే కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
‘‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు లాంటి యువకుడిని, అతని ప్యానెల్ని ఎన్నుకున్న ‘మా’ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేడు ఈ ప్రమాణాస్వీకార కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉంది. ‘మా’ అంటే చిన్న వ్యవస్థ కాదు. కుటుంబం కాదు. ఇది ఒక పెద్ద వ్యవస్థ. అలాంటి వ్యవస్థ అభివృద్ధిని తన భుజాలపై వేసుకుని.. సభ్యుల సంక్షేమం కోసం ఆయన ముందుకు వచ్చి ఎన్నికల్లో నిలబడటం గర్వించదగ్గ విషయం. ఎదుటివారితో ఎలా సంస్కారంగా ఉండాలో విష్ణుకి మోహన్బాబు నేర్పించారు. క్రమశిక్షణ అలవర్చారు. అలాగే, సుమారు 25 సంవత్సరాల నుంచి మోహన్బాబుకీ, నాకూ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది. మోహన్బాబుకి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ కోపంతో ఆయన ఎంతో నష్టపోయాడు. ఆ విషయం ఆయన మనసుకు కూడా తెలుసు. సమాజ హితం కోసమే ఆయన మాట్లాడతారు. వ్యక్తిగత లాభం కోసం ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. మంచి వ్యక్తులను ‘మా’ సభ్యులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. విష్ణుకి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తుంది. సినిమా పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలను ఆయన చేపట్టారు. సినిమా షూటింగ్కు అనువుగా ఉండే ఎన్నో ప్రదేశాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందులోనూ రామోజీ ఫిలింసిటీ ఓ అద్భుతమైన కళాఖండం. కరోనా కారణంగా సినిమా వాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్లకు చేయూత అందించడం కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు మరలా పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమాలు చూడాలని కోరుకుంటున్నాను. పైరసీని అంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది’’ అని తలసాని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా