Akhanda: బాలకృష్ణ అభిమానులకు శుభవార్త.. ఆ థియేటర్లలో ‘అఖండ’ బెనిఫిట్‌ షో షురూ!

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రం ‘అఖండ’. డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

Published : 01 Dec 2021 20:15 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రం ‘అఖండ’. డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా బెనిఫిట్‌ షోల ప్రదర్శనకు నగరంలోని రెండు థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కూకట్‌పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లకు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. ఈ స్పెషల్‌ షోలకు టికెట్‌ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ‘అఖండ’ చిత్రం ఈ థియేటర్లలోనే ప్రదర్శితంకానుంది. ఉదయం 4: 30 ని.లకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి సూపర్‌ హిట్ల తర్వాత వస్తున్న చిత్రమిది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని