Thaman: ఆ పాటకే... నెల రోజులు పనిచేశాం!
‘‘పెళ్లికి ముందు ఆహ్వాన పత్రికలా మారింది సంగీతం. సినిమాకి ప్రేక్షకుల్ని ఘనంగా ఆహ్వానించడం కోసం మంచి పాటలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు.
‘‘పెళ్లికి ముందు ఆహ్వాన పత్రికలా మారింది సంగీతం. సినిమాకి ప్రేక్షకుల్ని ఘనంగా ఆహ్వానించడం కోసం మంచి పాటలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. పది పదిహేనేళ్లపాటు ఈ ట్రెండ్ కొనసాగుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. పలువురు అగ్ర కథానాయకుల చిత్రాలకి సంగీతం అందిస్తూ అగ్ర శ్రేణి స్వరకర్తల్లో ఒకరిగా దూసుకెళుతున్నారీయన. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన ‘అఖండ’కి తమన్ స్వరాలు సమకూర్చారు. ‘అఖండ’ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తమన్ మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘బాలకృష్ణ సర్తో ‘డిక్టేటర్’ తర్వాత... బోయపాటి శ్రీనుతో ‘సరైనోడు’ తర్వాత నేను చేసిన సినిమా ఇది. బాలకృష్ణ - బోయపాటి కలయిక ప్రత్యేకమైనది. వాళ్లిద్దరి మధ్య గొప్ప అవగాహన ఉంటుంది. ఇద్దరూ కలిసి వందల చిత్రాలు చేసినా ఫ్లాప్ అవ్వవు. ఇందులో నేను భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ‘అఖండ’ తరచూ మనం చూసే వాణిజ్య సినిమా కాదు. విభిన్న థృక్కోణంతో ఆలోచించి చేసిన చిత్రం. ఇప్పటివరకు ఈ జోనర్లో నేను చేసిన సంగీతంలో ఇది అత్యుత్తమం అని చెబుతా’’.
* ‘‘ఈ కథలో సైన్స్ ఉంది. అఘోరా గురించి ఎంతో పరిశోధన చేశా. పలు పుస్తకాలు చదివిన తర్వాత ఆ పాత్రలకి తగ్గట్టుగా నేపథ్య సంగీతం ఇచ్చా. సగటు వాణిజ్య సినిమాలకైతే కొంచెం ఘాటుదనంతో కూడిన సంగీతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇలాంటి వాటికి అది కుదరదు. టైటిల్ గీతం చేయడానికే నెల రోజులు పట్టింది. ఒక గొప్ప సన్నివేశం తర్వాత ఆ పాట వస్తుంది. ఐదారు వందల మంది ఈ సినిమా సంగీతం కోసం పనిచేసి ఉంటారు. గాయకులే 120 మంది వరకు ఉంటారు. నాలుగు పాటలే ఉన్నా.. అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బాలకృష్ణ సర్ టైటిల్ గీతం విన్న వెంటనే మెచ్చుకున్నారు. హీరోల ఇమేజ్ తప్పకుండా మా పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. వాళ్లే కదా మా సంగీతాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేది. అందుకే వాళ్ల శైలికి, కథకి తగ్గట్టుగా సంగీతం అందిస్తుంటాం. తదుపరి బాలకృష్ణ సినిమాకీ నేనే సంగీతం అందిస్తున్నా’’.
‘‘పాట ఒకప్పటిలాగా మళ్లీ ముందుకొచ్చింది. ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి పాటతో ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో పాటని విడుదల చేయడంతో అది శ్రోతలకి బాగా చేరువవుతోంది, అదే సమయంలో సినిమా ప్రచారానికీ కలిసొస్తోంది. అన్ని పాటల్నీ ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నాం. ఆడియో కంపెనీలు ఒక్కో పాట చేస్తేనే మేలని చెప్పడంతో అలా కొనసాగిస్తున్నాం. ఈ కొత్త ట్రెండ్ వల్ల గాయకులు వెలుగులోకి వస్తున్నారు. వాళ్ల కష్టం కనిపిస్తోంది. కథానాయకులు కూడా సంగీత దర్శకులకి స్వేచ్ఛనిస్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. అది మంచి విషయం. ‘సర్కారు వారి పాట’కి సంబంధించిన పాటల సందడి జనవరి నుంచి మొదలవుతుంది’’.
‘‘సినిమా కోరుకున్న సంగీతాన్ని ఇవ్వాల్సిందే అనేది నా అభిప్రాయం. శంకర్ మహదేవన్ పాడితేనే ఆ పాటకి అందం అనుకుంటే ఆయనతోనే పాడిస్తా. తక్కువ ఖర్చు అవుతుంది కదా అని వేరేవాళ్లతో పాడించను. అదే సమయంలో ఎక్కువ ఖర్చు పెడితేనే ఎక్కువ నాణ్యతతో కూడిన సంగీతం వస్తుందనుకోవడమూ పొరపాటే. ఒకవేళ బడ్జెట్ లేదనుకుంటే ఎక్కడో ఒక చోట తగ్గించుకునైనా పాట కోరుకున్న గాయకులతో పాడించే ప్రయత్నం చేస్తుంటా. నెంబర్ గేమ్ని నేను నమ్మను. అది మనసులో ఉంటే పరిగెత్తలేం. నంబర్ అనేది పరిగెత్తే గుర్రాలకి ఉండాలేమో మనకు కాదు. రోజూ కష్టపడుతూ ముందుకు వెళ్లాలనేది నా సిద్ధాంతం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?