Saidharam Tej: సాయితేజ్‌ ఆరోగ్యంపై తమన్‌ ఆసక్తికర ట్వీట్‌

గత కొన్నిరోజుల క్రితం నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ ట్వీట్‌ చేశారు. అపోలో ఆస్పత్రిలో....

Published : 30 Sep 2021 14:47 IST

హైదరాబాద్‌: గత కొన్నిరోజుల క్రితం నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై సంగీత దర్శకుడు తమన్‌ ట్వీట్‌ చేశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని అన్నారు. త్వరలో తాను సాయిని కలవనున్నట్లు చెప్పారు. ‘సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం గురించి మీరు చేస్తున్న పూజలు ఫలించాయి. నా ప్రాణమిత్రుడు సాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మరికొన్ని రోజుల్లో అతన్ని కలవనున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. లవ్‌ యూ సాయి’ అని తమన్‌ ట్వీట్‌ చేశారు.

నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో సెప్టెంబర్‌ 10వ తేదీన రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సలో భాగంగా ఆయనకు వైద్యులు కాలర్‌ బోన్‌ సర్జరీ చేశారు. మరోవైపు, సాయితేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘రిపబ్లిక్‌’ అక్టోబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కలెక్టర్‌ పాత్రలో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని