
Thaman: అరవింద సమేతలో ఆ పాట కోసం ఎంతో కష్టపడ్డా..!
హైదరాబాద్: టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న తమన్.. గతంలో ఓ పాట కోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. కానీ, దానికి అనుకున్నంత స్థాయి గుర్తింపు రాలేదని వివరించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘అరవిందసమేత’ ఆల్బమ్ అంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ‘ఏడ పోయినాడో’ అనే పాట కోసం ఎంతో కష్టపడి వర్క్ చేశాను. అందులో విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాట పాడటం కోసం వైజాగ్ నుంచి నిఖిత శ్రీవల్లి అనే సింగర్ని పిలిపించాం. ఎంతోమంది వాయిస్లు టెస్ట్ చేశాం. కానీ, ఆ అమ్మాయి వాయిస్ మాత్రమే ఆ పాటకు సెట్ అయ్యింది. సినిమా విడుదలయ్యాక తప్పకుండా ఆ పాటకు మంచి గుర్తింపు వస్తుందని భావించాను. ‘రెడ్డమ్మతల్లి’, ‘పెనివిటి’ పాటలకు వచ్చినంత ప్రశంసలు ఈ పాటకు రాలేదు. అప్పుడు కొంచెం బాధగా అనిపించింది. అలాగే నేను ట్యూన్స్ కాపీ కొడుతున్నానంటూ కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తుంటాయి. అవి విన్నప్పుడు కొంత బాధగా ఉంటుంది. ఆ బాధ, కోపం పోగొట్టుకోవడానికి వెంటనే గ్రౌండ్కి వెళ్లి క్రికెట్ ఆడతా. పాటలకు అనుకున్నంత మంచిగా ట్యూన్స్ రాకపోయినా సరే వెంటనే గ్రౌండ్కి వెళ్లిపోతా’’ అని తమన్ వివరించారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.