Thank You: థియేటర్లలోనే ‘థ్యాంక్‌ యూ’

ఇటీవలే ‘లవ్‌స్టోరి’తో మెప్పించారు నాగ  చైతన్య. ఇప్పుడాయన నుంచి రానున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ నిర్మిస్తున్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, అవికా గోర్‌ కథానాయికలు.

Updated : 09 Dec 2021 09:35 IST

టీవలే ‘లవ్‌స్టోరి’తో మెప్పించారు నాగ  చైతన్య. ఇప్పుడాయన నుంచి రానున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ నిర్మిస్తున్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, అవికా గోర్‌ కథానాయికలు. త్వరలోనే దీన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని  నిర్మాతలు ప్రకటించారు. ‘‘నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి సమయం చూసి చిత్రాన్ని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందు ఉంచుతాం. విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తామ’న్నారు. ఇటీవల విడుదలైన నాగచైతన్య లుక్‌ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటోంది. హిందీలో ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ ఛద్దా’, తెలుగులో ‘బంగార్రాజు’ చిత్రాల్లో నాగచైతన్య నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని