Puneet Rajkumar: పునీత్‌ కోసం ఎన్టీఆర్‌ గానం.. ‘నందమూరి’ కుటుంబంతో అనుబంధం

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (46) ఇక లేరన్న విషయాన్ని భారతీయ చలన చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. గుండెపోటుతో శుక్రవారం తుదిశ్వాస విడిచారాయన.

Published : 30 Oct 2021 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (46) ఇక లేరన్న విషయాన్ని భారతీయ చలన చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన అకాల మరణం ఎంతోమందిని కలచివేస్తోంది. పునీత్ రాజ్‌కుమార్‌కి కన్నడనాటే కాదు తెలుగులోనూ అభిమానులున్నారు. ఇక్కడ తారలతో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగారు. ముఖ్యంగా నందమూరి కుటుంబంతో పునీత్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అందులోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ను రాజ్‌కుమార్‌ తన సోదురుడిగా భావించేవారు. తారక్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్తుండేవారు. ఆ అనుబంధంతోనే పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ఎన్టీఆర్‌ ఓ పాటని ఆలపించారు. తారక్‌ గానానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ డ్యాన్స్‌ తోడై ఈ పాట ఓ అద్భుతంగా నిలిచింది. ‘గెలయా గెలయా’ అంటూ సాగే ఈ హుషారైన గీతానికి తమన్‌ సంగీతం అందించారు.

బాలకృష్ణ అంటే అభిమానం..

నందమూరి బాలకృష్ణ అంటే పునీత్‌ రాజ్‌కుమార్‌కి ఎంతో అభిమానం. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ వేడుకకు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ వేదికపై రాజ్‌కుమార్‌, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్నారు. బాలకృష్ణ ముఖానికి ఏదో అంటుకుందని గుర్తించిన పునీత్‌ రాజ్‌కుమార్‌ దాన్ని శుభ్రం చేశారు. ఎంత ఎదిగినా పునీత్ ఒదిగి ఉండేవారని చెప్పేందుకు ఇంతకన్నా ఏం కావాలి!!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని